sahanamvande@gmail.com

కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలు

సహనం వందే, హైదరాబాద్:వచ్చే నవంబర్ 9వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలురైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మంత్రివర్గ సభ్యులు…

Read More

తెలంగాణ ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్రం ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం వేసింది. నర్సరీలు, నాణ్యతలేని మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. తెలంగాణలో జరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్)లకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం…

Read More

తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్ల ఆవేదన -ఎప్పుడని నిలదీత

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించి, నియామకాల కోసం ఎదురుచూస్తున్న ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం తమను, తమ కుటుంబాలను తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అభ్యర్థులు నిశాంత్ , అభినవ్, రంజిత్ తదితరులు మీడియాకు తమ ఆవేదనను వివరించారు. మూడేళ్ల నిరీక్షణ… అడ్డంకుల పరంపర2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ గ్రూప్ 1…

Read More

విమాన వేగంతో ఖమ్మం హైవే మీదుగా విశాఖకు ప్రయాణం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు మరో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సిద్ధం అవుతుంది. వచ్చే ఆగస్టు నాటికి ఇది అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. అంటే రాబోయే కీలకమైన సంక్రాంతి పండుగకు రయ్ రయ్ మంటూ విశాఖపట్నం దూసుకుపోవచ్చు. మధ్యలో ఉండే రాజమండ్రి ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఇది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్-వైజాగ్ మధ్య ఏకంగా 56 కిలోమీటర్లు తగ్గటం విశేషం. ఇప్పటివరకు ఈ మార్గంలో ప్రయాణం చేయడం అత్యంత…

Read More

వ్యవసాయ కార్యదర్శికి ఆయిల్ పామ్ సెగ

సహనం వందే, హైదరాబాద్: నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ విషయంపై సోమవారం హైదరాబాదులో విచారణ చేపట్టామని, దానికి ఆ ముగ్గురు కీలక అధికారులు హాజరుకావాలని ఆదేశించింది. నాసిరకం మొక్కలకు సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది….

Read More

ఓజస్ తేజో ఆధ్వ‌ర్యంలో… యోగా దినోత్స‌వ వేడుకలు

సహనం వందే, హైదరాబాద్:‘ఓజస్ తేజో యోగా’ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ డీడీ కాలనీ లైబ్రరీ హాల్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓజస్ తేజో యోగా ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకురాలు, యోగా గురువు వర్ష దేశ్‌పాండే మాట్లాడుతూ… యోగా విశిష్టతను, దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను వివరించారు. యోగా శారీరక,…

Read More

బతుకుపై బండ… చావుకు అండ…ఇంగ్లాండ్ లో చట్టం

సహనం వందే, ఇంగ్లాండ్: ఎంతటి తీవ్ర అనారోగ్యమైనా సహజ మరణం వచ్చేవరకు కాపాడుకోవడం మానవుడి లక్షణం. కానీ రోజులు మారుతున్నాయి. కలియుగం దాపురించింది. కొన ఊపిరి ఉన్నంతవరకు తోటి మనిషిని కాపాడుకోవాల్సిన మానవజాతి… వారిని వదిలించుకునేందుకు ఏకంగా చట్టాలు చేస్తుండటం ఆవేదన కలిగిస్తుంది. చచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ కొన్ని దేశాలు చట్టాలు చేశాయి. కొన్ని దేశాల్లో వాటిపై చర్చలు జరుగుతున్నాయి. మరణం హక్కుగా మారుతుండడం మానవత్వానికి మచ్చ. ఇంగ్లాండులో బిల్లుకు ఏర్పాటు..‌.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న…

Read More

ఏవీ ఇన్ఫ్రాకాన్ భారీ మోసం – రూ. 500 కోట్లు స్వాహా ….

సహనం వందే, హైదరాబాద్: బై బ్యాక్ పాలసీ పేరుతో భారీ పెట్టుబడులు ఆకర్షించి, రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన ఏవీ ఇన్ఫ్రాకాన్ సంస్థ దందా వెలుగులోకి వచ్చింది. అనతి కాలంలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సొమ్ము ఇస్తామని ఆశచూపి, వందలాది మంది బాధితులను నిండా ముంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ కేంద్రంగా దందా‌‌… ఏవీ ఇన్ఫ్రాకాన్ ఛైర్మన్ విజయ్ గోగుల మాదాపూర్‌ను…

Read More

విద్యతో పేదరిక నిర్మూలన – వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్:విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి అన్నారు. శనివారం సిటీ శివారులోని డీఎంఆర్ గార్డెన్స్‌లో సంస్థ వార్షికోత్సవం ‘ఏకత్వం – మనీ హాండ్స్, వన్ మిషన్’ థీమ్‌తో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 100కు పైగా సైకిళ్లు, పుస్తకాలు, క్రీడా సామగ్రిని గ్రామీణ పిల్లలకు పంపిణీ చేశారు. ప్రత్యూష సపోర్ట్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగని సహకారంతో 3,000 బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్‌లను హైస్కూల్ బాలికలకు అందజేశారు….

Read More

అగ్రికార్పొరేషన్లలో అవినీతి క్రీడ-కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

సహనం వందే, హైదరాబాద్: అన్నదాతలకు అన్ని విధాలా సాయం చేయాల్సిన వ్యవసాయ కార్పొరేషన్లు ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్ల చేతిలో బందీలుగా మారాయి. అగ్రి కార్పొరేషన్లనన్నీ రైతుల ఆస్తులుగానే పరిగణించాలి… కానీ వాటిల్లో పని చేస్తున్న కొందరు అధికారులు తమ సొంత జాగీరులా భావించటం సంస్థల స్ఫూర్తికే విరుద్ధం. ఆ సంస్థల్లో వందల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని ఉద్యోగులే మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేసి సమగ్ర నివేదిక…

Read More