కరోనా? కుట్రనా?

  • కొత్త కోవిడ్ వేరియంట్ హడావుడి
  • ప్రజలను భయభ్రాంతులు చేయడమే లక్ష్యమా?
  • వ్యాక్సిన్ కంపెనీల స్వార్థ ప్రయోజనాలపై విమర్శలు

సింగపూర్, భారతదేశంలో కోవిడ్ జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని పరీక్షించినప్పుడు ఈ వైరస్ బయటపడుతోందని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎండమిక్ దశలో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు అంతర్జాతీయంగా దాని వ్యాప్తిని మళ్ళీ ముందుకు తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం పన్నుతున్న కుట్రగా కొందరు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా నిజంగానే మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగిస్తుందా? లేక దాని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. గతంలో కూడా ఇలా హడావుడి చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసిన సంఘటనలను కొందరు గుర్తుచేస్తున్నారు.

జేఎన్.1 వేరియంట్ ఆందోళన
సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, భారతదేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త పెరుగుదలకు ప్రధాన కారణం ఒమిక్రాన్ ఉప-వేరియంట్ జేఎన్.1 అని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో 257 క్రియాశీల కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ గురించి తెలుసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.

జేఎన్.1 వేరియంట్ ఏమిటి?
జేఎన్.1 అనేది ఒమిక్రాన్ బీఏ.2.86 (పైరోలా) ఉప-వంశానికి చెందిన వేరియంట్. దీన్ని 2023 ఆగస్టులో మొదటిసారి కనుగొన్నారు. రోగనిరోధక శక్తిని తప్పించుకోగల సుమారు 30 మ్యూటేషన్లు (మార్పులను) ఇది కలిగి ఉందని అంటున్నారు. ఇది అత్యంత సంక్రమణ సామర్థ్యం కలిగిన వేరియంట్‌గా చెప్తున్నారు. అయితే ఇది తక్కువ తీవ్రత కలిగిన లక్షణాలను కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

జేఎన్.1 లక్షణాలు

  • దగ్గు, గొంతు నొప్పి
  • అలసట, కండరాల నొప్పులు
  • ముక్కు దిబ్బడ, తుమ్ములు
  • వికారం, వాంతులు, అతిసారం
  • బ్రెయిన్ ఫాగ్ లేదా ఏకాగ్రత లేకపోవడం
  • కండ్లకలక (కంజెక్టివైటిస్)
    పాత కోవిడ్ లక్షణాలైన రుచి లేదా వాసన కోల్పోవడం ఈ వేరియెంట్‌తో తక్కువగా కనిపిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

ప్రమాదం ఉందా? లేదా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జేఎన్.1ని వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ గా వర్గీకరించింది. ఇది మునుపటి వేరియెంట్‌ల కంటే ఎక్కువ సంక్రమణ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, తీవ్రమైన అనారోగ్యం లేదా మరణాలకు దారితీసే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు తెలిపారు. భారతదేశంలో నమోదైన కేసులు సాధారణంగా తేలికపాటి లక్షణాలతోనే ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ వేరియంట్ పేరుతో మళ్ళీ వ్యాక్సిన్ల అవసరాన్ని నొక్కి చెప్పడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరాలకు సాధారణంగా అందుబాటులో ఉన్న మందులు పనిచేస్తున్నప్పుడు, ఈ కొత్త వేరియంట్‌కు ప్రత్యేక జాగ్రత్తలు, బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచించడం వెనుక వ్యాక్సిన్ కంపెనీల ప్రయోజనాలు దాగి ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే దీని తీవ్రత తక్కువైతే, మళ్ళీ ఈ ప్రచారం ఎందుకు జరుగుతోందని కొందరు నిలదీస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *