- ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
సహనం వందే, రాజేంద్రనగర్:
విడాకులు ఇస్తున్నా అంటూ ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ తలాక్ అని మూడుసార్లు చెప్పాడు. అనంతరం భార్యపిల్లలను చితకబాదాడు. ఆపై వారిని ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీ లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్ వహీద్ కింగ్స్ కాలనీలో తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా వీరు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో అతడు ఆదివారం భార్య, బిడ్డను బెల్టుతో చితకబాదాడు. ఆ తర్వాత భార్యకు తలాక్.. తలాక్.. తలాక్ అని చెప్పాడు. అనంతరం వారిని బయటకు పంపించి చున్నీతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ నరేందర్ తెలిపారు.