మహారాష్ట్రలో హిందీకి బ్రేక్

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో భాషా రాజకీయాలు మరోసారి వేడెక్కడంతో, ప్రాంతీయ వాణి గట్టిగా వినిపించడంతో ఈ ఉత్తర్వును నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత…

Read More

ఆస్తి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు

సహనం వందే, నారాయణపేట: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిన ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా రాని కొడుకు, తండ్రికి తామే కొడుకులం అంటూ ముందుకొచ్చిన కూతుళ్ల కథ ఇది. కుమారుడికి ఆస్తి పంచినా తీరని కోపం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తిని కుమారుడు, కుమార్తెలకు పంచారు. కుమారుడు గిరీష్‌కు 15 ఎకరాల…

Read More

తమిళంలో సంతకం ఎందుకు చేయరు?

సహనం వందే, చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తమిళ భాషపై ప్రేమ ఉన్నట్లయితే, తమిళనాడు నాయకులు తమ సంతకాలను తమిళ భాషలోనే చేయాలని పీఎం మోదీ సూచించారు. “తమిళనాడు నాయకుల నుంచి నాకు వచ్చే లేఖలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో ఎవరూ తమ సంతకాలను తమిళ భాషలో చేయడం లేదు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో భాషా వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో…

Read More

ట్రంప్ ఖమ్మంలో పుట్టాడా?

   అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ పేరుతో ఆధార్– ఖమ్మంలోని మామిళ్లగూడెం అడ్రస్ తో కార్డు– ఇలా ఏఐతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు– ఎలాంటి పత్రాలనైనా సృష్టించే అవకాశం– ఆర్థిక మోసాలు మరింత పెరిగే ప్రమాదం– ఆందోళన వ్యక్తం చేస్తున్న యంత్రాంగం సహనం వందే, హైదరాబాద్:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పుట్టాడా? వినడానికి విస్మయం కలిగిస్తున్నా… ఆధార్ కార్డు మాత్రం అలాగే చెబుతుంది. అమెరికాలో జన్మించిన ట్రంప్ కు భారత్ లోని ఆధార్…

Read More

పుల్లారెడ్డి స్వీట్స్‌ను తొక్కేసిన దాదూస్

   ఉత్తరాది చేతుల్లోకి దక్షిణాది వ్యాపార సామ్రాజ్యం – దక్షిణాదిలో ఉత్తరాది వ్యాపార వాటా 40% – హైదరాబాదులో స్వీట్స్ నుంచి బంగారం వరకు ఉత్తరాధిపత్యం – హైదరాబాద్ నుంచి మొదలు విజయవాడ, చెన్నై, బెంగుళూర్ వరకు వ్యాపార విస్తరణ సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్తరాది నుంచి వలస వచ్చిన మార్వాడీలు స్థానిక వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎత్తులు, జిత్తులతో స్థానిక వ్యాపారస్తులను తొక్కేస్తూ వీరు వ్యాపార రంగంలో ఆధిపత్యం సాధిస్తున్నారు. హైదరాబాద్,…

Read More

‘ఓవైసీకి తెలుగు రాదు… సీతక్కకు హిందీ రాదు’

   అసెంబ్లీ సాక్షిగా తెలుగుపై సాంస్కృతిక దాడి – హైదరాబాద్ హిందీ నగరంగా మారుతుంది – ఈ దుస్థితి తెలుగు అస్తిత్వానికి పెను ముప్పు! – సిటీలో తెలుగులో మాట్లాడేవారు 40 శాతమే – ఉత్తరాది వలసలు, వ్యాపారాలతో అధోగతి – పదో తరగతిలో హిందీ ఫెయిల్ అయ్యేవారు ఎక్కువే – విద్యార్థుల మెడకు త్రిభాషా సూత్రం అమలు – మ్యూజియం భాషగా తెలుగు మారకముందే మేల్కొనాలి – హిందీ దురాక్రమణను తిప్పి కొట్టాలని ‘సౌత్ సేన’…

Read More

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం

   చెన్నైలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు – మద్రాస్ ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో కీలక ప్రసంగం – దక్షిణాది జనాభా పెరగకపోతే ఉత్తరాది నుంచి వలసలు వస్తాయని హెచ్చరిక సహనం వందే, చెన్నై నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఐఐటీ మద్రాస్‌లో శుక్రవారం జరిగిన “అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025” లో పాల్గొన్న ఆయన, డీలిమిటేషన్ వల్ల…

Read More

మీ పాఠాలు మాకు అవసరం లేదు: స్టాలిన్

– యూపీ సీఎం యోగి వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటు ప్రతిస్పందన సహనం వందే, చెన్నై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తమిళనాడు ద్విభాషా విధానం, పార్లమెంటరీ స్థానాల పునర్విభజనపై తమ రాష్ట్రం అభిప్రాయాలను వ్యక్తం చేయడం బీజేపీకి నచ్చడం లేదని స్టాలిన్ అన్నారు. తమిళనాడు ఎప్పటినుంచో హిందీని తప్పనిసరి చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ‘మేము హిందీ భాషకు వ్యతిరేకం కాదు. కానీ…

Read More

దక్షిణాది పోరాటంలో ఆంధ్ర ఒంటరి!

డీలిమిటేషన్ ఉద్యమానికి దూరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు – రాజకీయ స్వార్థాలు ప్రజా ప్రయోజనాలను బలిపెడుతున్నాయా? – ఎన్డీఏ కూటమిలో ఉన్నందున చెన్నై సమావేశానికి వెళ్లని టీడీపీ, జనసేన – మరి వైసీపీ అధినేత జగన్ వెళ్లకపోవడంలో ఆంతర్యం ఏంటి? – రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీల నేతలు… విధానాలు సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తున్న ఈ కీలక సమయంలో, తమిళనాడు, కర్ణాటక, కేరళ,…

Read More

డబ్బు కోసం గడ్డి

సినీ తారలు, సెలబ్రిటీల పోకడ – బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో బాధ్యతారాహిత్యం – ఫలితంగా అనేకమంది యువత ఆత్మహత్య – గుట్కాలు, మద్యం బ్రాండ్లకు కూడా సినిమా తారల ప్రచారంపై విమర్శలు సహనం వందే, హైదరాబాద్ సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు.. వీళ్లంటే సామాన్యులకు ఎంతో అభిమానం. తెరపై కనిపించే హీరోలను ఆదర్శంగా తీసుకుని పాటించేవారు అనేకమంది ఉంటున్నారు. అయితే డబ్బుల కోసమో, మరే ఇతర కారణాల వల్లో సెలబ్రిటీలు చేసే తప్పుడు వాణిజ్య ప్రకటనలు ప్రజలను…

Read More