ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More

కవితక్క వెనుక వ్యూహకర్త!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఏకంగా తన తండ్రిపైనే యుద్ధం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘మై డియర్ డాడీ’ అంటూ ఆరు పేజీల సంచలన లేఖ రాసి, పార్టీలోని అసంతృప్తిని, లోపాలను కవిత తీవ్ర పదజాలంతో ఎత్తి చూపారు. బీజేపీతో పొత్తు ఊహాగానాలు, సీనియర్ నేతలకు అవకాశాలు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో స్పష్టత లోపించడం వంటి అంశాలపై కవిత…

Read More

నంబాల కేశవరావుకు ఎల్ టీటీఈ శిక్షణ

సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తమిళ ఎల్ టీటీఈ గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో ఎక్స్‌పర్టు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా…

Read More

ఎవడైతే నాకేంటి?

సహనం వందే, హైదరాబాద్: ఆయన రాష్ట్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి. జిల్లా వైద్యాధికారులకు దిశా నిర్దేశం చేస్తుంటారు. ఆ అధికారికి నోటి దురుసు ఎక్కువ. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొందరు వైద్యాధికారులు హైదరాబాదులోని ఆ కీలక అధికారిని కలిశారు. తమ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వైఖరితో విసిగిపోయామని, ఆయన్ను తొలగించాలని… అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంగీకారం తెలుపుతూ లేఖ రాశారని తమ బాస్ కు…

Read More

‘ఇది కర్ణాటక… ఇది ఇండియా’

సహనం వందే, కర్ణాటక: కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారిణి ప్రవర్తన రాష్ట్రంలో తీవ్ర భాషా వివాదానికి దారితీసింది. అనేకల్ తాలూకాలోని సూర్యనగర బ్రాంచ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ కస్టమర్‌తో అధికారిణి కన్నడ మాట్లాడటానికి నిరాకరించింది‌. పైగా హిందీ మాట్లాడాలని పట్టుబట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు ఆ ఉద్యోగిణిని బదిలీ చేశారు. కస్టమర్‌తో అధికారిణి తీవ్ర వాగ్వాదంసూర్య…

Read More

మ్యాచ్ టాప్… మ్యాథ్స్ వీక్

సహనం వందే, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, కొన్నేళ్ల క్రితం నాటి విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల జాబితా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మార్కుల జాబితాను ఐఏఎస్ అధికారి జితిన్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మార్కుల జాబితాలో…

Read More

‘మరాఠీ మాట్లాడితేనే డబ్బులు ఇస్తాం’

సహనం వందే, ముంబై: ముంబైలోని భాండుప్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన భాషా అభిమానానికి అద్దం పడుతోంది. సాయి రాధే అపార్ట్‌మెంట్‌లో ఒక జంట, తమ ఇంటికి పిజ్జా డెలివరీ చేసిన వ్యక్తి మరాఠీ మాట్లాడలేదనే కారణంతో డబ్బులు చెల్లించడానికి నిరాకరించారు. హిందీ మాట్లాడకూడదని వాళ్ళు హుకుం జారీ చేశారు. ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నీకు మరాఠీ రాదు.. డబ్బులు ఇవ్వం!’డొమినోస్ డెలివరీ ఏజెంట్ రోహిత్ లవారే పిజ్జా ఆర్డర్‌తో వెళ్లినప్పుడు,…

Read More

పాకిస్తాన్ కాదు మోసగిస్తాన్

సహనం వందే, న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, భారత సైన్యం తగిన రీతిలో స్పందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మధ్యాహ్నం అంగీకారం… సాయంత్రం ఉల్లంఘనవిక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం…

Read More

‘అందం’పై యుద్ధమేఘం

సహనం వందే, హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. భారత సైన్యం సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువును ఎదుర్కొంటున్న సమయంలో, అందాల పోటీల్లో ఆనందించే పరిస్థితి దేశంలో లేదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘మన జవాన్లు దేశం కోసం పోరాడుతుంటే, హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం జాతీయ మనోభావాలను గాయపరుస్తుంద’ని ఒకరు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోటీలు కొనసాగితే దేశ ఐక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు…

Read More

పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి

సహనం వందే, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ భాషా సంస్కృతులపై తమకున్న అపారమైన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలు తమ పిల్లలకు, అలాగే తమ వ్యాపార సంస్థలకు తప్పనిసరిగా తమిళ పేర్లే పెట్టాలని ఆయన సూచించారు. భాషా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళ గుర్తింపును మరింతగా పెంపొందించే లక్ష్యంతో స్టాలిన్ నవదంపతులు, వ్యాపారులను ఉద్దేశించి ఈ పిలుపునిచ్చారు. ఆయన సందేశం తమిళ ప్రజల్లో భాషాభిమానాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది. పెళ్లి వేడుకలో…

Read More