సహనం వందే, హైదరాబాద్:
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులకు శుక్రవారం ఉదయం అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కె.ఆర్. సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు తదితర ఎంపీలు రాష్ట్రపతి భవన్లో అల్పాహారం స్వీకరించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ఎంపీలతో పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్రపతితో తెలంగాణ ఎంపీల అల్పాహారం
