సహనం వందే, హైదరాబాద్:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ ఈ నేపథ్యంలో ప్రధానికి ఈ లేఖ రాయడం గమనారం. బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో కోరారు.
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
