ఆపరేషన్ ‘సినీ’దూర్

  • ఆపరేషన్ సిందూరానికి మద్దతు ఏది?
  • అభిమానులతో ర్యాలీ నిర్వహించలేరా?
  • సైన్యానికి సంఘీభావం కోసం డబ్బు డిమాండ్
  • సైనికులకు సెల్యూట్ చేసేందుకూ డబ్బేనా?
  • దేశం కోసం నిలబడమంటే డొల్ల మాటలు!
  • తెర మీద హీరోలు… నిజ జీవితంలో విలన్లు
  • వీళ్ళు ఏమైనా పైనుంచి దిగివచ్చిన దేవుళ్ళా?

ఆయన ఒకానొక పెద్ద సినిమా స్టార్… అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. చిటికేస్తే అభిమానులు తరలివస్తారు. తన కోసం ప్రాణం ఇస్తారు. అలాంటి స్టార్ మన దేశ సైన్యానికి మద్దతు కోసం ర్యాలీ నిర్వహించాలని ఒక ప్రముఖ వ్యక్తి కోరగా, డబ్బులు ఇస్తే చేస్తానని అన్నాడట. ఇంతకంటే నీచత్వం ఇంకేమైనా ఉంటుందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సినిమా విడుదలవుతుందంటే చాలు, వేల మంది అభిమానులను తరలించి ప్రచార హోరు సృష్టిస్తారు. వారికి దేశమంటే పట్టదా? అనేకమంది పెద్దపెద్ద హీరోలు తమ సినిమాల కోసం ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులకు మద్దతు తెలిపేందుకు వీరందరూ కలిసి హైదరాబాద్ నడిబొడ్డున ఒక సభ నిర్వహించే దమ్ము లేదా? తెర మీద డైలాగులు చెప్పి చప్పట్లు కొట్టించుకునే వీళ్ళేం హీరోలు? దేశాన్ని కాపాడుతున్న నిజమైన హీరోలకు సెల్యూట్ చేయడానికి కూడా ఈ సినీ తారలకు మనసు రావడం లేదా? డబ్బు ఇస్తేనే దేశభక్తి ప్రకటనలు చేస్తామని కొంతమంది స్టార్లు అంటున్నారట. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?

యుద్ధంపై స్పందించని సినీ పెద్దలు!
మన దేశం ఉగ్రవాదంపై పోరాడుతున్న ఈ క్లిష్ట సమయంలో భారతీయ సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా శత్రువు స్థావరాలపై విజయం సాధించింది. అయితే చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖుల స్పందన మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొందరు నటీనటులు సోషల్ మీడియాలో మొక్కుబడిగా స్పందిస్తే, మరికొందరు ఈ విషయంపై కనీసం పెదవి విప్పడానికి కూడా ఇష్టపడటం లేదు. దేశం కోసం ప్రాణాలను అర్పించే సైనికులకు మద్దతుగా సినీ పరిశ్రమ ఒక బలమైన గళం వినిపించాల్సిన సమయం ఇది కాదా? వీధుల్లోకి వచ్చి సంఘీభావం తెలపడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? సినిమా వేడుకలు, ఇతర కార్యక్రమాలకు భారీ ప్రచారం చేసే సినీ తారలు… దేశం కష్టాల్లో ఉన్నప్పుడు, మన సైనికులు పోరాడుతున్నప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? డబ్బు ఇస్తేనే స్పందిస్తారా? దేశభక్తి అంటే వారికి కేవలం సినిమా డైలాగులేనా? కోట్లాది రూపాయలు సంపాదించే ఈ నటులు, తమ అభిమానులను ఒక్క పిలుపుతో సమీకరించి దేశ సైన్యానికి మద్దతుగా ఒక భారీ ర్యాలీ ఎందుకు నిర్వహించలేరు? వారు పిలిస్తే హైదరాబాద్ వీధులు దేశభక్తి నినాదాలతో నిండిపోతాయి కదా? ఈ ఉదాసీనతకు కారణమేమిటి?

స్పందించని బాలీవుడ్ అగ్ర తారలు…
పహల్గామ్‌లో జరిగిన దారుణానికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు దేశం మద్దతు తెలుపుతోంది. అయితే బాలీవుడ్‌లోని అగ్ర నటులైన అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దేశాన్ని కాపాడుతున్న సైనికులకు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా వారికి మనసు రావడం లేదా అని అభిమానులు నిలదీస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కూడా ఈ విషయంపై స్పందించకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ ప్రకటనల కోసం వెంటనే స్పందించే వీరు, దేశం కోసం ఒక చిన్న సందేశం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దేశభక్తి సినిమాల్లో కాదు..‌. నిజజీవితంలో అవసరమైనప్పుడు మన వంతు ప్రయత్నం చేయడమే. జైహింద్… జై భారత్… భారత సైన్యం వర్ధిల్లాలి. పాకిస్తాన్ ముర్దాబాద్.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *