సహనం వందే, న్యూఢిల్లీ:
ఢిల్లీలో జర్నలిస్టులపై జరిగిన పోలీసు దాడికి నిరసనగా ఫొటో జర్నలిస్టులు పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. కెమెరాలను కింద పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఓ విద్యార్థి కిందపడిపోయిన సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయారు. ఇదంతా గమనించిన ఓ పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించాడు. వెంటనే పోలీసులు ఆమెపై దాడి చేసి కెమెరా లాక్కొన్నారు. అదే సమయంలో మరొక మహిళా జర్నలిస్టును ఓ పోలీసు అధికారి వెనక్కి తోశాడు. తరువాత “ఆమెను విద్యార్థి అనుకుని తోశాం” అంటూ వివరణ ఇచ్చారు. కానీ, ఒక మహిళా జర్నలిస్టును అలా తాకడం ఏమాత్రం సమంజసం కాదని విమర్శలు వ్యక్తమయ్యాయి.
దాడిపై ఆగ్రహావేశాలు
ఈ దాడిలో ఫస్ట్ పోస్ట్ విలేఖరి ప్రవీణ్ సింగ్ చేతికి తీవ్ర గాయం అయ్యింది. మిగతా విలేకరులకు గాయాలు అయ్యాయి. మీడియాపై పోలీసుల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటనను ఖండిస్తూ ఫొటో జర్నలిస్టులు పోలీసు ప్రధాన కార్యాలయం ముందు తమ కెమెరాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. “చిత్రాలు మాటలకన్నా బలమైనవి” అనే మాటను నిజం చేసేలా, ఆ కెమెరాల మౌన నిరసన ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై పెరుగుతున్న బెదిరింపులను వెల్లడించింది.
కెమెరాలే నిరసన ప్రకటిస్తే…
