ప్రభుత్వం సమాధానం చెప్పాలని సబిత డిమాండ్
సహనం వందే, హైదరాబాద్:
మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ కామెంట్స్పై మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదివారం స్పందించారు. మిల్లా మ్యాగీ ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ పరువును ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించారు. మ్యాగీ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రపంచ దేశాల యువతులను ఎవరు వేధించారో తేల్చాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరో తేల్చాలని… మహిళా కమిషన్ స్పందించి విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.