అక్షయ తృతీయ… స్వర్ణ లక్ష్మి కటాక్షం

హిందూ పుణ్య సంప్రదాయంలో స్వర్ణాన్ని కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైన సమయంగా విలసిల్లే అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సంవత్సరంలో ఈ శుభ ఘడియలలో బంగారాన్ని సొంతం చేసుకోవడానికి దివ్యమైన ముహూర్తాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ తేదీలలో కొనుగోలు చేయవచ్చు. ఈనెల 22, 24, 27, 29, 30 తేదీల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ పుణ్య తిథులలో బంగారాన్ని కొనుగోలు చేయడం ఆర్థిక స్థిరత్వానికి, సిరిసంపదల వృద్ధికి శుభ సంకేతంగా పెద్దలు విశ్వసిస్తారు.

ఖగోళ గతుల పరిశీలన, మార్కెట్ నిపుణుల జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఈ ఏడాది జూన్ మాసం నుండి అక్టోబర్ మాసం వరకు బంగారం ధరలు స్థిరమైన ఊర్ధ్వముఖంగా పయనించే సూచనలు గోచరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతల కారణంగా సురక్షితమైన పెట్టుబడుల వైపు మదుపర్ల దృష్టి మరలుతోంది. ఈ కారణంగా స్వర్ణానికి డిమాండ్ పెరిగి ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. అక్షయ తృతీయ పుణ్య సందర్భంగా బంగారంపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నవారు ఈ శుభ ముహూర్తాలను సద్వినియోగం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం అని నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే నెలల్లో బంగారం ధరలు మరింత పెరిగే సూచనలు ఉన్నందున, ఈ సమయంలో కొనుగోలు చేయడం ఆర్థికంగా లాభదాయకమైన నిర్ణయంగా భావించవచ్చు.

అక్షయ తృతీయ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఇది ఆర్థిక సంపదను సూచించే పవిత్రమైన యోగం. ఈ శుభ సందర్భంలో చేసే స్వర్ణ కొనుగోలు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను ప్రసాదిస్తుందని విశ్వాసం. కావున పైన తెలిపిన శుభ ముహూర్తాలను మనసునందు నిలుపుకొని సరైన ప్రణాళికతో ముందుకు సాగడం ఉత్తమం

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *