‘ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్’

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో రెండు చేతులు కోల్పోయిన 9 ఏళ్ల పాలస్తీనియన్ బాలుడు మహమూద్ అజ్జౌర్ చిత్రం 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. గాజా ఫోటోగ్రాఫర్ సమర్ అబూ ఎలౌఫ్ తీసిన ఈ చిత్రం యుద్ధం భయానక పరిణామాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

గత ఏడాది గాజాపై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మహమూద్ తీవ్రంగా గాయపడ్డాడు. బాంబు పేలుడులో ఒక చేయి పూర్తిగా తెగిపోగా, మరొకటి తీవ్రంగా దెబ్బతింది. ఖతార్‌లో చికిత్స పొందుతున్న మహమూద్‌ను ఫోటోగ్రాఫర్ సమర్ కలిశారు. న్యూయార్క్ టైమ్స్ కోసం పనిచేస్తున్న సమర్, మహమూద్ ధైర్యాన్ని బాధను బంధిస్తూ ఈ శక్తివంతమైన చిత్రాన్ని తీశారు. పోటీలో 60 వేలకు పైగా చిత్రాలను దాటి ఇది ఉత్తమంగా నిలిచింది.

గాజాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి సమర్ అబూ ఎలౌఫ్ తన కెమెరాతో యుద్ధ భయానక దృశ్యాలను ప్రపంచానికి చూపిస్తున్నారు. మహమూద్ చిత్రాన్ని తీసేటప్పుడు ఆమె గాజాలో జరుగుతున్న విషాదాన్ని స్వయంగా అనుభవించారు. ఈ అవార్డు గెలిచినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, గాజాలోని పరిస్థితులు తనను కలచివేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఈ చిత్రం బయటపెట్టిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. యుద్ధం యొక్క భయానక ముఖాన్ని ఈ ఫోటో చూపిస్తోందని, మహమూద్ లాంటి పిల్లల కథలు ప్రపంచాన్ని మేల్కొల్పాలని వారు అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *