రాగి బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు!

  • అతిగా వాడితే కాపర్ టాక్సిసిటీ సమస్య
  • పెద్దలు రోజుకు 1.3 మి.గ్రా రాగిని తీసుకోవాలి

కాపర్ (రాగి) బాటిళ్లు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, అతిగా రాగిని తీసుకోవడం వల్ల ‘కాపర్ టాక్సిసిటీ’ సమస్య తలెత్తుతుంది. ఇది కిడ్నీలు, లివర్‌కు తీవ్రమైన హాని కలిగించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్నవారు రాగి బాటిళ్లను ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం… రాగి మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది రక్త కణాల ఉత్పత్తికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. రాగి బాటిల్‌లో నీటిని నిల్వ చేయడం వల్ల కొద్ది మొత్తంలో రాగి నీటిలో కలుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, బ్యాక్టీరియాను నాశనం చేయడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేదంలో ఇది పురాతన కాలం నుండి ఆచరిస్తున్న పద్ధతి. అయితే రాగి అధిక మోతాదులో తీసుకుంటే హానికరం. దీనిని ‘కాపర్ టాక్సిసిటీ’ అంటారు. దీని లక్షణాలు వికారం, వాంతులు, కడుపు నొప్పి, డయేరియా వంటివి ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలంగా అధిక రాగి స్థాయిలకు గురికావడం వల్ల కాలేయం (లివర్) మరియు మూత్రపిండాలు (కిడ్నీలు) శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పెద్దలు రోజుకు 1.3 నుంచి రెండు మిల్లీగ్రాముల వరకు రాగిని తీసుకోవాలని సూచించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *