సహనం వందే, హైదరాబాద్:
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తమిళ ఎల్ టీటీఈ గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో ఎక్స్పర్టు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో దాడుల వెనుక ఆయన హస్తం ఉంది. ఏపీలోని ఎమ్మెల్యే కిడారి ఈశ్వరరావు హత్యకు కేశవరావు ప్రాధాన సూత్రధారిగా ఉన్నారు. 2010 దంతేవాడలో జరిగిన 76 మంది సిఆర్పిఎఫ్ సభ్యుల బ్లాస్ట్ కు సైతం అతనే సూత్రధారి. మిలటరీ దాడుల వ్యూహకర్తగా కేశవరావుకు మంచి పేరుంది.