సహనం వందే, హైదరాబాద్:
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పసుపు రైతులను పట్టించుకోలేదని, కానీ ప్రతిపక్షంలోకి వచ్చాకా.. పసుపు రైతులపై దొంగ ప్రేమ ఒలకపోస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పసుపు రైతులు ఆందోళన చేస్తే… రోడ్ల మీదకు రాకుండా ఆంక్షలు పెట్టి, కేసులు పెట్టి జైల్లో వేసిన చరిత్ర మీది అని గుర్తుచేశారు. తనపై సైతం కేసులు పెట్టినట్లు తెలిపారు. మంగళవారం ఆయన హాకా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు రైతుల కోసం పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. వైఎస్ హయాంలోనే నిజామాబాద్ జిల్లాలో పసుపు పరిశోధన సంస్థ కోసం స్థలం కేటాయించారని, మద్దతు ధర లేకున్నా అప్పటి కేంద్ర ప్రభుత్వ అనుమతితో పసుపు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో అత్యధికంగా క్వింటాల్ కు 16 వేల రూపాయల ధర పలికిందని తెలిపారు. కానీ బీఆర్ఎస్ హయాంలో కేవలం 6 వేల నుండి 7 వేల వరకే ధర వచ్చిందన్నారు. అధికారంలో ఉన్న సమయంలో పట్టించుకోని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత… ఇప్పుడు మాత్రం దొంగ ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటుచేసినా.. మద్దతు ధర కల్పించలేకపోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పసుపు క్వింటాల్ కు పసుపు ధర రూ. 11 వేలు ధర పలుకుతోంది. ఈ ధర కూడా సరిపోదు.. ఇంకా ధర పెరగాలన్నారు. ధర రాకపోడానికి ప్రధానంగా వ్యాపారస్తులు సిండికేట్ కావడమేనని స్పష్టం చేశార
పసుపుకు కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి
