మోడీ ఇంట్లో ‘సీక్రెట్’ చూశా – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని కలలుగన్న ఆయన… ఏకంగా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంపీ అయిన వెంటనే తిరుపతికి వెళ్లి ప్రసాదం తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. మోడీ అపాయింట్మెంట్ లేదు. కానీ కలవాలన్న కృతనిశ్చయంతో వెళ్లారు. ఆయన నమ్ముకున్నట్లు మోడీ కలవడానికి అనుమతి లభించింది. ప్రసాదం చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన అనేకమంది…

Read More

మహారాష్ట్రలో బీసీ కోటా మంటలు – రిజర్వేషన్ల కోసం మరాఠాల ఉద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మరోసారి ఉద్ధృతమైంది. మరాఠా కోటా కోసం పోరాడుతున్న నాయకుడు మనోజ్ జరంగే ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మరాఠా సామాజిక వర్గానికి సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనం (ఎస్‌ఈబీసీ) హోదా కల్పించి, విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు వేలాది మంది మరాఠాలు, రైతులు, యువత మద్దతుగా కదులుతున్నారు. జరంగే ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పోరాటం నుంచి…

Read More

కుర్చీ వదలని ఎంఎన్ జే డైరెక్టర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును వెంటనే రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఈనెల 26వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి యంత్రాంగం ఆయనను ఎందుకు రిలీవ్ చేయడం లేదని…

Read More

స్మిత సబర్’వార్’ – రేవంత్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సెలవు నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఆరు నెలలపాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవడం వెనుక నిజమైన కారణాలు ఏంటనేది అంతుచిక్కడం లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో సెలవు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో…

Read More

అద్దెకు అమ్మమ్మ… కిరాయికి తాతయ్య – వృద్ధాశ్రమాల్లో బాగోద్వేగాల అమ్మకం

సహనం వందే, ఆగ్రా:ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం తెరపైకి తెచ్చిన వృద్ధులను కిరాయికి ఇచ్చే కొత్త పథకం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఇది మంచి ఉద్దేశంతో మొదలైందని ఆశ్రమ నిర్వాహకులు ఎంత చెబుతున్నా దీని వెనుక దాగిన చీకటి కోణాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఒంటరి పిల్లలకు కుటుంబ సాంగత్యం, వృద్ధులకు ఆదరణ అనే తీపి మాటలు వెనుక డబ్బు సంపాదన, అక్రమ కార్యకలాపాలు దాగి ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, మానవ…

Read More

రైల్వే సమస్యలపై ఎంపీ గళం -ప్రజల గొంతుకైన ఎంపీ అప్పలనాయుడు

సహనం వందే, భువనేశ్వర్:ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ కమిటీ సమావేశం వేదికగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజల గళాన్ని బలంగా వినిపించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల రైల్వే సమస్యలను జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ముందు వివరించారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనూ తాను ఈ సమస్యలను లేవనెత్తినట్లు గుర్తు చేస్తూ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భువనేశ్వర్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో…

Read More

ఇంటి గుట్టు… రహస్యం రట్టు – ఏపీలో ఫ్యామిలీ కార్డులకు శ్రీకారం

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఫ్యామిలీ కార్డు సెగలు రేపుతోంది. ప్రజల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్డులను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్పుతోంది. అయితే దాని వెనుక ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి నిఘా పెట్టే కుట్ర ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటి సర్వేల పేరుతో ప్రజల ఆస్తులు, ఆదాయ వివరాలు సేకరించి రాజకీయ లబ్ధికి వాడుకున్నారని వచ్చిన విమర్శల…

Read More

ముఖ్యమంత్రి వినాయక్’రెడ్డి’ – రేవంత్ రెడ్డి వేషధారణతో గణపతి

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లోని ఆఘాపురాలో ఏర్పాటు చేసిన ఒక వినాయక మండపం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపంలో వినాయకుడి విగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేషధారణలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్యాంటు, షర్టు, బూట్లు, మెడలో కండువా ధరించి ఉన్న గణనాథుని రూపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజకీయ నేతపై అభిమానం ఇక్కడి నిర్వాహకులను ఈ విధమైన…

Read More

వాట్సాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్ – ఢిల్లీ పౌరులకు సర్కారు కొత్త సౌకర్యం

సహనం వందే, న్యూఢిల్లీ:ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ ద్వారానే ఇంటి నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం ప్రజల సమయాన్ని ఆదా చేసి, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుంది. ఈ కొత్త సౌలభ్యం వల్ల ప్రభుత్వ సర్వీసులు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ఎలా పని చేస్తుంది?ఈ సరికొత్త విధానం చాలా సులభంగా…

Read More

అజ్ఞాత దాతల అవినీతి ముసుగు – గుజరాత్‌లో వేల కోట్ల సీక్రెట్ డొనేషన్స్

సహనం వందే, న్యూఢిల్లీ:గుజరాత్‌లో జరిగిన భారీ అక్రమ ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. 2019-24 మధ్య కాలంలో గుజరాత్‌లోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… సంస్థలు ఏకంగా రూ. 4,300 కోట్ల భారీ విరాళాలు స్వీకరించాయని ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ఎవరిది? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఎవరికి చేరాయి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల…

Read More