తిరుమలలో దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

సహనం వందే, హైదరాబాద్:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవాన్ష్ చేతుల మీదుగా ప్రసాదాల పంపిణీ చేశారు. దేవాన్ష్ కూడా తన తాతతోపాటు భక్తులకు అన్నప్రసాదాలు స్వయంగా వడ్డించి, వారి ఆశీర్వాదాలు పొందాడు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీటీడీ అన్నదాన ట్రస్ట్ కు విరాళం…
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి అయ్యే పూర్తి ఖర్చును చంద్రబాబు కుటుంబ సభ్యులు టీటీడీ అన్నదాన ట్రస్ట్ కు విరాళంగా అందజేశారు. ప్రతి సంవత్సరం దేవాన్ష్ జన్మదినం సందర్భంగా చంద్రబాబు కుటుంబం ఈ విరాళాన్ని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రబాబు కుటుంబ సభ్యులు తమతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం తిరుమలలో సందడి వాతావరణాన్ని సృష్టించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *