sahanamvande@gmail.com

పాఠ్యపుస్తకాల్లో ‘మొఘలు’లకు మంగళం

సహనం వందే, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ ఏడో తరగతి పాఠ్యపుస్తకాలను పూర్తిగా మార్చడం సంచలనంగా మారింది. ఈ పుస్తకాల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. నూతన పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తానేట్‌కు సంబంధించిన సమస్త చరిత్రను తొలగించింది. ‘భూమి ఎలా పవిత్రమవుతుంద’నే కొత్త చాప్టర్ ను పొందుపరిచారు. ఈ చాప్టర్లో హిందూ, బౌద్ధ, సిక్కు, ఇస్లాం, క్రైస్తవ, జుడాయిజం, జోరాస్ట్రియన్ మతాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే భారత్ సహా ఇతర దేశాల్లోని…

Read More

‘భారతి’ సిమెంట్స్ ‘గోవింద’

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారిగా భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ పేరు తెరపైకి వచ్చింది. తాడేపల్లిలో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలాజీని ఆజ్ఞాతంలో దాచినట్లు వార్తలు వస్తుండగా, ఆయన దొరికితే భారతి సిమెంట్స్‌తో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు…

Read More

ఉగ్రదాడికి స్థానికుల సహకారం

సహనం వందే, పహల్గామ్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రదాడి వెనుక 15 మంది స్థానికులు టెర్రరిస్టులకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. టెర్రరిస్టులకు పథకం రూపొందించడంలోనూ, అమలు చేయడంలోనూ స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఏకే-47, ఎం4 రైఫిళ్లతో దాడి చేసి అనేక మంది పౌరులను, భద్రతా సిబ్బందిని హతమార్చారు. ఈ దాడి స్థానిక సహకారం లేకుండా సాధ్యం కాదని విచారణలో వెల్లడైంది. ఎలక్ట్రానిక్…

Read More

పేదల ఇళ్లు కూల్చొద్దు!

సహనం వందే వరంగల్: ‘హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. తెలంగాణను నెంబర్‌వన్‌ స్థానంలో నిలబెడితే, ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. నా కళ్ల ముందు తెలంగాణ పరిస్థితి ఇలా అవుతుంటే బాధ కలుగుతోంది. మరో రెండున్నరేళ్లలో ఇక ఏమీ చేయగలుగుతార’ని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత దుస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు…

Read More

వైరస్‌తో వేగంగా వృద్ధాప్యం

సహనం వందే, బల్గేరియా: వేగంగా వృద్ధాప్యం చేసే వైరస్‌పై ప్రఖ్యాత బల్గేరియన్ జోతిష్యురాలు బాబా వాంగా మరోసారి ప్రపంచాన్ని కలవరపెట్టే జోస్యం చెప్పారు. ఆమె ఊహించిన ప్రకారం, 2088 సంవత్సరంలో ఒక భయంకరమైన వైరస్ మానవులను చుట్టుముట్టనుందట! ఈ రహస్యమైన వైరస్ మనుషులను చాలా వేగంగా వృద్ధాప్యం చేసేస్తుందని, వారి ఆయుష్షును గణనీయంగా తగ్గిస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ జోస్యం ఇంకా చాలా దూరంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సింథటిక్ బయాలజీ అభివృద్ధి,…

Read More

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు

సహనం వందే హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల పదవి విరమణ చేస్తున్నడంతో రామకృష్ణారావుని ప్రభుత్వం నియమించింది. మరోవైపు తెలంగాణలో ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా శశాంక్ గోయెల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట…

Read More

తెలుగు తెరపై ‘ఉత్తరాధి’పత్యం

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ… ఒకప్పుడు తెలుగు భాష, సంస్కృతి, జీవన విధానాన్ని తెరపై చాటి గర్వంగా తలెత్తుకుంది. ఏటా 100-150 చిత్రాలతో బాక్సాఫీస్‌లో బాలీవుడ్‌తో సమానంగా పోటీపడిన ఈ పరిశ్రమ, ఇప్పుడు ఉత్తరాది నటుల ఆధిపత్యం ముందు గిలగిలలాడుతుంది. తమన్నా, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, బాబీ డియోల్, సునీల్ షెట్టి, శ్రద్ధా కపూర్, అనన్య పాండే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ఉత్తరాది సినీ తారలు టాలీవుడ్‌ను సాంస్కృతికంగా…

Read More

నెలకు 60 కోట్ల సంపాదన లక్ష్యం!

సహనం వందే, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలతో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేసినట్లు రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన కీలక సమావేశంలో నెలకు సుమారు రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించేందుకు వ్యూహరచన జరిగిందని…

Read More

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్ 2025’లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్న ఈ సమ్మిట్ చివరి రోజున రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. విపక్షాలను అణగదొక్కడమే అధికార…

Read More

కాశ్మీర్ వెయ్యేళ్ళ పోరాటమా?

సహనం వందే వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ సమస్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. భారత్, పాకిస్థాన్‌లు కాశ్మీర్ కోసం “వెయ్యి సంవత్సరాలుగా” పోరాడుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చరిత్రాత్మకంగా తప్పుగా ఉన్నాయని, పాకిస్థాన్ 1947లోనే ఏర్పడిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. భారత్-పాక్…

Read More