సహనం వందే, మహబూబ్నగర్:
మహబూబ్నగర్ జిల్లా రాజోలి మండలం పెద్ద ధనవాడలో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు హింసాత్మక ఆందోళనలకు దిగారు. ఫ్యాక్టరీ వద్ద గుడిసెలు, పరికరాలను ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం పెరుగుతుందని, నీరు కలుషితమవుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నారాయణపేట, దిలావర్పూర్లలోనూ ఇలాంటి ఆందోళనలు జరిగాయి.