- కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
- పుదుచ్చేరిలోని జిప్మర్లో శ్రీకారం
- ఆధునిక, మూలికా వైద్యాల కలయిక
సహనం వందే, హైదరాబాద్:
పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఎంబీబీఎస్, బీఏఎంఎస్ లను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సును ప్రవేశపెట్టనుంది. ఆధునిక వైద్య విజ్ఞానం, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య పద్ధతులను సమన్వయం చేయడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం.
ప్రాథమిక దశలో కోర్సు…
ప్రస్తుతం ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రాథమిక దశలో ఉంది. ఈ కోర్సు కోసం సరికొత్త సిలబస్ను రూపొందించే పనిలో జిప్మర్ నిమగ్నమై ఉంది. ఈ సిలబస్ ఎంబీబీఎస్లోని ఆధునిక వైద్య శాస్త్ర అంశాలతో పాటు ఆయుర్వేదంలోని మూలికా వైద్యం, రోగ నిర్ధారణ, చికిత్సా పద్ధతులతో రూపొందిస్తారు. దీని ద్వారా విద్యార్థులు రెండు వైద్య విధానాల్లోనూ నైపుణ్యం సాధించే అవకాశం లభిస్తుంది. తద్వారా రోగులకు సమగ్ర చికిత్సా విధానాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కోర్సు వైద్యులకు ఆయుర్వేద సూత్రాల ఆధారంగా సాంప్రదాయ చికిత్సలను అర్థం చేసుకోవడంతో పాటు ఆధునిక వైద్య సాంకేతికతలను వినియోగించే సామర్థ్యాన్ని అందిస్తుంది. భారతీయ వైద్య వ్యవస్థలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
భవిష్యత్తు ప్రణాళిక…
ఈ కోర్సు అమలుకు సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదు. సిలబస్ రూపకల్పన పూర్తయిన తర్వాత కోర్సు నిర్మాణం, వ్యవధి, ప్రవేశ ప్రక్రియ, ఇతర వివరాలను జిప్మర్ అధికారికంగా ప్రకటించనుంది. ఈ కోర్సు విజయవంతంగా అమలైతే ఇతర మెడికల్ కాలేజీలలో కూడా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లను ప్రవేశపెట్టడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఎంబీబీఎస్, బీఏఎంఎస్ లను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సును ప్రవేశపెట్టనుంది. ఆధునిక వైద్య విజ్ఞానం, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య పద్ధతులను సమన్వయం చేయడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం.