ఓజస్ తేజో ఆధ్వ‌ర్యంలో… యోగా దినోత్స‌వ వేడుకలు

సహనం వందే, హైదరాబాద్:
‘ఓజస్ తేజో యోగా’ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ డీడీ కాలనీ లైబ్రరీ హాల్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓజస్ తేజో యోగా ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకురాలు, యోగా గురువు వర్ష దేశ్‌పాండే మాట్లాడుతూ… యోగా విశిష్టతను, దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను వివరించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యంపై చూపే సానుకూల ప్రభావాన్ని నొక్కి చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడానికి రోజులో కొంత సమయం కేటాయించాలని సూచించారు. ప్రస్తుత నగర జీవితంలో మహిళలందరికీ రోజువారీ యోగా సాధన ఆవశ్యకతను వివరించారు. అనంతరం పలు యోగాసనాలు వేసి అందరిలో స్ఫూర్తి నింపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *