- టీడీపీ కార్యకర్తపై వేటు… అరెస్టు
సహనం వందే, అమరావతి:
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్గా స్పందించింది. మహిళల పట్ల ఇలాంటి తప్పుగా మాట్లాడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. దీనిలో భాగంగా పార్టీ అధిష్టానం వెంటనే చేబ్రోలు కిరణ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు కిరణ్పై కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, గుంటూరులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. గతంలో వైసీపీ నేత వల్లభనేని వంశీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టీడీపీ నాయకులు దాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు తమ పార్టీ కార్యకర్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ ఇబ్బందికర పరిస్థితిలో పడింది.