- ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలు
- ఈ యుద్ధంతో లక్షల కోట్ల వ్యాపారం
సహనం వందే, హైదరాబాద్:
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ పై దాదాపు యుద్ధం మొదలైనట్లే. చారిత్రాత్మకంగా అలీన విధానాన్ని అనుసరించిన భారత్, ఇప్పుడు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లను తగ్గించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యతను కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు చైనాపై ఆధారపడుతూ తన సైనిక అవసరాలను తీర్చుకుంటోంది.
భారత్ ఆయుధ వ్యూహంలో మార్పు…
భారత్ గతంలో రష్యాపై ఆధారపడగా, ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఇది భారత విదేశాంగ విధానంలో కీలక మార్పు. ఒకప్పుడు అమెరికా నుంచి ఆయుధాలు పొందిన పాకిస్తాన్, ఇప్పుడు చైనాను తన ప్రధాన సరఫరాదారుగా మార్చుకుంది. ఈ రెండు దేశాలు ఇప్పుడు లక్షల కోట్ల ఖర్చుతో ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. పాకిస్తాన్ కు చైనా పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.