సహనం వందే, అమరావతి:
విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ సంచలన ట్వీట్ చేసింది. ‘మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగింది. తాడేపల్లి పార్క్ విల్లా నెంబర్ 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి వచ్చారు… 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు చంద్రబాబు నమ్మినబంటు టీడీ జనార్ధన్ వచ్చారు. 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపారని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.