దిక్కులేని దీనులు… ‘మహా’ విద్యార్థులు – మహావీర్ మెడికల్ కాలేజీలో పరిస్థితి ఘోరం

వికారాబాద్ నుంచి ‘సహనం వందే’ ప్రతినిధి:వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిని పరిశీలిస్తే దీనికి ఇన్నాళ్లు ఎలా అనుమతులు వచ్చాయా అన్న అనుమానాలు తలెత్తుతాయి. జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కళ్ళు మూసుకుని ముడుపులు పుచ్చుకొని బాజాప్తా అనుమతులు ఇచ్చినట్లు అర్థం అవుతుంది. ఈ స్టోరీని చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి… లేదా ఈ ఆర్టికల్ తోపాటు పెడుతున్న వీడియోలను చూడండి. దానికి అనుమతులు ఇవ్వడం న్యాయమా లేదా మీరే నిర్ణయించండి….

Read More

చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటం – గురుకులలో ఫుడ్ పాయిజన్ తో 48 మంది చావడమా?

సహనం వందే, హైదరాబాద్:మనం నాగరిక సమాజంలోనే బతుకుతున్నామా? ఏఐ కాలంలోనూ పేద విద్యార్థులను కాపాడుకునే స్థితిలో కూడా లేమా? ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్న గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అనేకమంది విద్యార్థులు మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదా? తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో 886 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగి 48 మంది బహుజన పేద విద్యార్థులు మరణించారంటే… ఇవి సాధారణ మరణాలు కావు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో జరిగిన హత్యలుగా…

Read More

డాక్టర్లా? బూచోళ్ళా? – ఆసుపత్రుల్లో శిశువులకు రక్షణ కరువు

సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు అసలు రక్షణ ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజస్థాన్లో ఎత్తుకొచ్చిన శిశువును కొనుగోలు చేసి… సరోగసి ద్వారా పుట్టించామని ఆ బిడ్డను తల్లిదండ్రులకు విక్రయించిన డాక్టర్ నమ్రత వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో శిశువులను ఎత్తుకుచ్చే గ్యాంగ్ తో ఫెర్టిలిటీ సెంటర్ సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది….

Read More

‘సృష్టి’ వైద్యాధికారులపై చర్యలు? – తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు

సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ఆ వ్యవహారం వెనక ఉన్న అధికారులు ఎవరో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వైద్యాధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ ‘సహనం వందే’ ప్రతినిధితో మాట్లాడుతూ… సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తున్నట్లు…

Read More

విత్తనాల దందా… అధికారుల అండ – అధిక ధరలతో అన్నదాత లూటీ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరకు విక్రయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోయాబీన్ విత్తనాల కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం రూ. 2,400 మాత్రమే కాగా… కొందరు వ్యాపారులు రైతుల నుంచి రూ. 2,600 వరకు…

Read More

ఢిల్లీతో రేవంత్ రె’ఢ్డీ’ – బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతోనే కొట్లాట

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు…

Read More

‘సృష్టి’కి వైద్యాధికారి అండదండ… నకిలీ ఐవీఎఫ్ సెంటర్లకు అనుమతులు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ యూనివర్సల్ ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతకు హైదరాబాదుకు చెందిన ఒక కీలక వైద్యాధికారి అండదండలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమెపై అనేక ఫిర్యాదులు రావడం… కేసులు నమోదు కావడం జరిగింది. అయినప్పటికీ ఆ ఫెర్టిలిటీ సెంటర్ కు అన్ని విధాలుగా ఆ అధికారి అనుమతులు ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. ఆమె చేస్తున్న అక్రమాల్లో ఆయనకు కూడా వాటా ఉందన్న ప్రచారం జరుగుతుంది. సంతానం లేని దంపతులను మోసం చేస్తూ కోట్లు…

Read More

అక్రమ సంబంధాల ‘కాంచీపురం’ – దేశంలోనే మొదటి స్థానం నిలిచిన పుణ్యక్షేత్రం

సహనం వందే, హైదరాబాద్:మారుతున్న జీవనశైలితోపాటు సంబంధాలు, అనుబంధాలు కూడా మారతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు దేశంలో విపరీతంగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంబంధాల మోజులో పడి కట్టుకున్నవాళ్ళనే కడతేర్చిన ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మేఘాలయలో భర్తను చంపిన భార్య ఉదంతం… అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త పెళ్లికొడుకును కడతేర్చిన నవ వధువు ఉదంతాలు ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలకు కాంచీపురం అడ్డాగా మారిందని ప్రముఖ డేటింగ్ యాప్ వెల్లడించిన…

Read More

లైవ్ సర్జరీల వ్యాపారానికి చెక్ – ప్రైవేట్ ఆసుపత్రులకు కేంద్రం ముకుతాడు

సహనం వందే, న్యూఢిల్లీ:ప్రైవేట్ ఆసుపత్రుల్లో లైవ్ సర్జరీలు నిర్వహించే విధానంలో రోగుల భద్రత, నైతిక ప్రమాణాలను కాపాడేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. లైవ్ సర్జరీ లకు తప్పనిసరిగా ఎన్ఎంసీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోవాలి. రోగుల భద్రతను ఫణంగా పెట్టి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ సర్జరీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఎన్ఎంసీ కఠిన నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఆసుపత్రులు, సర్జన్లు, వైద్య సంస్థలు అమలు…

Read More

రాష్ట్ర జడ్జీల సంఘం ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర జడ్జీల సంఘం అధ్యక్షుడిగా జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. సంఘం ఎన్నికలు ఈ నెల 19న జరిగాయి. ఈ ఎన్నికలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా పర్యవేక్షించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తికావడంతో, విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికలు న్యాయవ్యవస్థలో నూతన నాయకత్వానికి మార్గం సుగమం చేశాయి. వారి నాయకత్వంలో తెలంగాణ…

Read More