జ్యోతిష్యం చెబుతున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా?

సహనం వందే, హైదరాబాద్:అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచుతుంటే… జ్యోతిష్యురాలు శర్మిష్ఠ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ సంఘటన జరుగుతుందని తాను ముందే జోస్యం చెప్పానని ఆమె అంటున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పారా? లేదా ఈ సంఘటన జరగాలని చేతబడి చేశారా? లేదా చావులకు ముహూర్తం పెట్టారా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పినట్లుగా లేదు… తాను అంచనా వేసినట్లే ఈ ఘటన జరగడంపై ఆనందం వ్యక్తం…

Read More

గుడ్డు గోల్‌మాల్‌ – మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో డ్రామా

సహనం వందే, హైదరాబాద్:మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న గుడ్డు గోల్‌మాల్‌ షాక్‌కు గురిచేస్తోంది. పాత కాంట్రాక్టర్లకే గుడ్ల సరఫరా కట్టబెడుతూ, కొత్త టెండర్ల ఎంపికలో జాప్యం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు 36 కోట్లకు పైగా కోడిగుడ్ల సరఫరా కోసం ఏటా టెండర్లు జారీ చేయాలి. కానీ ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన టెండర్లు పాత కాంట్రాక్టర్ల కోసమే అన్నట్లుగా నిబంధనలు వచ్చాయి. దీనిపై పౌల్ట్రీ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా,…

Read More

మెడికల్ కౌన్సిల్ – నకిలీ వైద్యులపై కొరడా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టి.ఎం.సి.) ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరైన వైద్య విద్యా అర్హతలు లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న 15 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలుగత నెలలో జరిగిన ఈ తనిఖీల అనంతరం ఈ కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలియజేసింది. ఈ తనిఖీలను…

Read More

మహావీర్ మెడికల్ కాలేజ్ మహా డ్రామా..నకిలీ రోగికి రూ. 2 వేలు

సహనం వందే, హైదరాబాద్:వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సోమవారం ప్రారంభం కావాల్సిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలకు బ్రేక్ పడింది. సహనం వందే, ఆర్టికల్ టుడే డిజిటల్ పేపర్లలో వచ్చిన కథనాలతో ఎన్ఎంసీ అధికారులు వెనక్కి తగ్గారు. ముందస్తు సమాచారం ఇచ్చి మహావీర్ మెడికల్ కాలేజీకి తనిఖీలకు వస్తున్నారని సహనం వందే, ఆర్టికల్ టుడే లు (sahanamvande.com & articletoday.in) ప్రచురించడం సంచలనం అయ్యింది. ఈ విషయం ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి కూడా…

Read More

ఆయిల్ ఫెడ్ ఎండీపై వేటు?.. కొత్త ఎండీగా శంకరయ్య

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషాను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. ఆ సంస్థలో అనేక అవినీతి అక్రమాలు వెలుగు చూస్తుండటం… వాటిని నియంత్రించలేదన్న విమర్శలు రావడం… అనేక అదనపు బాధ్యతలు ఉండటం… తదితర కారణాలతో యాస్మిన్ బాషాను తప్పించి పూర్తిస్థాయి ఎండీగా శంకరయ్యను నియమించింది. ఆయిల్ ఫెడ్ లో కింది నుంచి పైస్థాయి వరకు అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ (sahanamvande.com & articletoday.in) డిజిటల్ పేపర్లు…

Read More

అదృశ్యమై దశాబ్దం.. జాడలేని మలేషియా ఎయిర్‌లైన్స్

సహనం వందే, హైదరాబాద్:2014 మార్చి 8న మలేషియా రాజధాని కౌలాలంపూర్‌… సరిగ్గా అర్ధరాత్రి 12:41 గంటలకు బోయింగ్ 777-200 మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం చైనా రాజధాని బీజింగ్‌ వైపునకు బయలుదేరింది. అందులో 239 మంది ప్రయాణిస్తున్నారు. బయలుదేరిన గంట తర్వాత విమానం అకస్మాత్తుగా రాడార్‌లో కనిపించకుండా పోయింది. చివరిసారి ‘గుడ్ నైట్ మలేషియన్ త్రీ సెవెన్ జీరో’ అని విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి సమాచారం ఇచ్చిన తర్వాత గల్లంతైంది. ఆ తర్వాత విమానం…

Read More

బోయింగ్ ఢమాల్ -అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎఫెక్ట్

సహనం వందే, అమెరికా:అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటన… అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని అత్యంత విజయవంతమైన విమానాల్లో ఒకటైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ భద్రతా రికార్డును తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే భద్రతా, ఉత్పత్తి సమస్యలతో సతమతమవుతున్న బోయింగ్ సంస్థకు ఈ ప్రమాదం మరో గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్ (నాస్డాక్)లో బోయింగ్ షేర్లు 6.5% నుండి 8% వరకు పడిపోయాయి. దీని ఫలితంగా సంస్థకు…

Read More

సెక్యులరిజం నయా ట్రెండ్ – మతాలకు గుడ్ బై చెబుతున్న కోట్లమంది

సహనం వందే, ఢిల్లీ: ప్రపంచంలో సెక్యులరిజం పెరుగుతుంది. వివిధ మతాల నుంచి కోట్ల మంది బయటకు వస్తున్నారు. అలాగేఅమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలకు చెందిన అనేకమంది సెక్యులరిస్టులుగా మారిపోతున్నారు. ప్రపంచంలో క్రైస్తవుల జనాభా 230 కోట్లు, ఇస్లాం మతస్తుల జనాభా 200 కోట్లు… ఆ తర్వాత మూడో వర్గం ఏ మతానికీ చెందని వారు 147 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత 120 కోట్ల మంది హిందూ మతస్తులు ఉన్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్…

Read More

మందులో మంగ్లీ చిందు -బర్త్డే పార్టీలో అడ్డంగా బుక్

సహనం వందే, హైదరాబాద్: సింగర్ మంగ్లీ అడ్డంగా బుక్కయ్యారు. తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలనుకుని పోలీసులకు చిక్కిపోయారు. డ్రగ్స్, విదేశీ మద్యం ఆరోపణలతో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఆమె కుటుంబం బెంబేలెత్తిపోయింది. అయితే పుట్టినరోజు పార్టీలకు, డీజేలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి, మంగ్లీకి సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ వాడితే నేరంగా భావించి అరెస్టు చేయవచ్చు, జైలుకు కూడా పంపవచ్చు. కానీ పుట్టినరోజు వేడుకలకు అనుమతి లేదని పోలీసులు…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో… చిన్న తిమింగలం 200 కోట్లు మింగేస్తే..

సహనం వందే, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కలలను ఆశలతో నింపి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా చిత్రీకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, దానిని అవినీతి యంత్రంగా మార్చి ముంచింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో బంగారం, నగదు, విలాసవంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ,…

Read More