కీరవాణీ… హిందువులనే అవమానిస్తావా?

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ‘పాడుతా తీయగా’ అనే ఒక సింగింగ్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రవస్తి ఆరాధ్య ఆయనపై బాడీ షేమింగ్ ఆరోపణలు చేయగా, ఇప్పుడు కీరవాణి గతంలో చేసిన ఒక వ్యాఖ్య వైరల్ కావడంతో ఆయనను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి.

ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలతో దుమారం…

‘పాడుతా తీయగా’ 25వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ప్రవస్తి ఆరాధ్య, జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఎమ్ఎమ్ కీరవాణి, సునీతలపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను బాడీ షేమింగ్ చేస్తున్నారని, కొందరు కంటెస్టెంట్స్‌ను ప్రత్యేకంగా చూస్తున్నారని, కీరవాణి పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు వేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు సంగీత పరిశ్రమలో కలకలం రేపాయి.

కీరవాణి వీడియో… హిందువుల ఆగ్రహం

ఈ వివాదం కొనసాగుతుండగానే కీరవాణి గతంలో ఒక సింగింగ్ షోలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కీరవాణి తాను అన్ని మతాలను సమానంగా చూస్తానని, ముఖ్యంగా తనకు జీసస్ అంటే ఇష్టమని చెప్పారు. అయితే క్రిస్టియన్ మతంలో మాత్రమే ఇతరులను క్షమించే గుణం ఉంటుందని, వేరే మతాల్లో అలా ఉండదని ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

హిందువులను అవమానించారని నిప్పులు…

కీరవాణి చేసిన ఈ వ్యాఖ్యలు హిందువులను అవమానించేలా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. క్రిస్టియన్ మతంలో మాత్రమే క్షమించే గుణం ఉంటుందని చెప్పడం సరైనది కాదని, ఇది ఇతర మతాలను కించపరిచేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కీరవాణి సినిమాలను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు ఊపందుకున్నాయి.

బాడీ షేమింగ్ ఆరోపణలకు మరింత బలం…

ప్రవస్తి ఆరాధ్య చేసిన బాడీ షేమింగ్ ఆరోపణల నేపథ్యంలో, కీరవాణి క్రైస్తవ మతంపై చేసిన ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో ఆయనపై మరింత వ్యతిరేకత పెరుగుతోంది. తన మతంపై ఇంత నెగటివ్‌గా మాట్లాడిన వ్యక్తి, ఖచ్చితంగా బాడీ షేమింగ్ కూడా చేసి ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *