- ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ నిర్ణయం
- సీఎంఆర్ఎఫ్ నిధుల్లో అక్రమాలే కారణం
సహనం వందే, ఖమ్మం:
ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి నకిలీ బిల్లులు సమర్పించి నిధులు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం మూసివేశారు. చికిత్సలు చేయకుండానే నిధులు కాజేయడం ఆయా ఆసుపత్రుల అక్రమాలకు పరాకాష్ట. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులను పొందిన కొన్ని ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడ్డాయని ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విచారణ చేపట్టింది. అందుకోసం ఒక బృందాన్ని హైదరాబాదు నుంచి పంపించింది. ఆ బృందం చేపట్టిన దర్యాప్తులో అక్రమాలు నిజమేనని తేలింది. సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు వాటిని మూసివేస్తున్నట్లు డీఎంహెచ్వో బి.కళావతి బాయి ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆస్పత్రుల మూసివేత…
- శ్రీ వినాయక హాస్పిటల్
- శ్రీ కర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
- సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
- వైష్ణవి హాస్పిటల్
- సుజాత హాస్పిటల్
- ఆరెంజ్ హాస్పిటల్
- న్యూ అమృత హాస్పిటల్
- మేఘశ్రీ హాస్పిటల్
- డాక్టర్ కేఆర్ ప్రసాద్ హాస్పిటల్
- గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్