- తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు
- స్మితా సబర్వాల్కు కీలక బాధ్యతలు
సహనం వందే హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల పదవి విరమణ చేస్తున్నడంతో రామకృష్ణారావుని ప్రభుత్వం నియమించింది. మరోవైపు తెలంగాణలో ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్గా శశాంక్ గోయెల్, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్. వెంకట్ రావు, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్, ఫ్యూచర్ సిటీ కమిషనర్గా శశాంక, జెన్కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణ, పరిశ్రమలు, పెట్టుబడుల సీఈవోగా జయేశ్ రంజన్, హెచ్ఎండీఏ సెక్రటరీగా ఇలంబర్తిలను నియమించారు.