– మొదటి 10 స్థానాల్లో మోదీ, రాహుల్ గాంధీ
సహనం వందే, హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలనా నైపుణ్యంతో, ప్రభావవంతమైన రాజకీయంతో దేశవ్యాప్తంగా శక్తిమంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసిన 2025 సంవత్సరానికి సంబంధించిన అత్యంత శక్తిమంతుల జాబితాలో ఆయన 28వ స్థానం సంపాదించారు. 2024 జాబితాలో 39వ స్థానంలో ఉన్న ఆయన ఒక్క ఏడాది వ్యవధిలోనే 11 స్థానాలు ఎగబాకి ఈ ఘనత సాధించారు.
కీలక నాయకుల సరసన రేవంత్…
ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. మమతా బెనర్జీ, ఎం.కె. స్టాలిన్, సిద్ధరామయ్య వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రులు తొలి 25 స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి 28వ స్థానానికి చేరుకోవడం అతని నైపుణ్యాన్ని వెల్లడిస్తోంది. తెలంగాణలో పాలనలో చేసిన అనేక కీలక నిర్ణయాలు రేవంత్ రెడ్డిని జాతీయ స్థాయిలో మరింత ప్రభావశీలమైన నాయకుడిగా నిలబెట్టాయి.