భద్రాచలం శ్రీరామనవమికి సీఎంకు ఆహ్వానం

సహనం వందే, హైదరాబాద్:
భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను ఆదివారం కలిసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు.
ఆలయ అభివృద్ధిపై చర్చ…
సమావేశంలో భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, నిధుల కేటాయింపు వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *