సహనం వందే, ఢిల్లీ:
భారత్ జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం జరిగిన నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక పురోగతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారత్కు అనుకూలంగా ఉన్నాయని సుబ్రమణ్యం తెలిపారు. ‘ప్రస్తుతం మనం నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ’ అని అన్నారు.