కోట్లు కొల్లగొట్టారు – కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేసే కుట్ర

  • ఆయిల్ ఫెడ్ లో అంతా ప్రీ యూనిక్ మయం
  • ఆ సంస్థకే టెండర్లు దక్కేలా నిబంధనలు
  • బయో-మాస్ ప్లాంట్లలో రూ. 40 కోట్ల దోపిడీ
  • ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ మండిపాటు
  • కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు లేఖ

తెలంగాణ ఆయిల్ ఫెడ్ పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు కీలక స్థాయి వ్యక్తులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని పామాయిల్ రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ను నాశనం చేస్తున్నారని అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేసింది. ఈ లేఖ ఆయిల్ ఫెడ్ అధికారుల అవినీతి, కుట్రలను బట్టబయలు చేసింది. ఆ వివరాలను ఆ సొసైటీ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి పుల్లయ్య వెల్లడించారు.

ప్రీ యూనిక్ తో చెట్టపట్టాల్…
రాష్ట్రంలో 14 ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్ పామ్ జోన్‌లు కేటాయించినా, ఇప్పటివరకు ఒక్క కంపెనీ కూడా ఫ్యాక్టరీలు నిర్మించలేదు. ఆయిల్ ఫెడ్ మాత్రమే ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టింది. ఆ ప్రైవేట్ కంపెనీలో ఒకటైన ప్రీ యూనిక్ అనే సంస్థ సొంతంగా ఫ్యాక్టరీని నిర్మించకపోగా, ఆయిల్ ఫెడ్ ను కబళిస్తుందన్న విమర్శలున్నాయి.

ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలోని నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్ ను అప్పనంగా దక్కించుకొని కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు. ఆ సంస్థ ఒక్కటే ఆయిల్ ఫెడ్ లో రూ. 400 కోట్ల ప్రాజెక్టులను చేపడుతుంది. అశ్వరావుపేట సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు పది ప్రాజెక్టులు ఈ కంపెనీ చేతుల్లోనే ఉండటం గమనార్హం. అప్పటి ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారి ప్రీ యూనిక్ సంస్థకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇది అతిపెద్ద అవినీతి కుంభకోణమని సొసైటీ ఆరోపించింది.

ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలోని నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్ ను అప్పనంగా దక్కించుకొని కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు. ఆ సంస్థ ఒక్కటే ఆయిల్ ఫెడ్ లో రూ. 400 కోట్ల ప్రాజెక్టులను చేపడుతుంది. అశ్వరావుపేట సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు పది ప్రాజెక్టులు ఈ కంపెనీ చేతుల్లోనే ఉండటం గమనార్హం. అప్పటి ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారి ప్రీ యూనిక్ సంస్థకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇది అతిపెద్ద అవినీతి కుంభకోణమని సొసైటీ ఆరోపించింది. ఈ కుంభకోణంలో కీలకమైన పైస్థాయి అధికారులు కోట్ల రూపాయలు మింగేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి టెండర్లలో జాప్రో కంపెనీ తక్కువకు కోట్ చేసినప్పటికీ సాంకేతిక కారణాలు చూపించి ఎలాగోలా ప్రీ యూనిక్ కంపెనీకి దక్కేలా ఆ ఉన్నతాధికారి కుట్రలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కోట్ల రూపాయలు కొట్టేశారని విమర్శించారు.

బయో-మాస్ ప్లాంట్లలో రూ. 40 కోట్లు ఫట్…
2022లో అప్పారావుపేటలో బయో-మాస్ పవర్ ప్లాంట్లను నిర్మించిన ఆయిల్ ఫెడ్, 2024లో అశ్వారావుపేటలో రూ. 40 కోట్లతో మరో ప్లాంట్‌ను ప్రారంభించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఈ ప్లాంట్ కేవలం ఏడు రోజులు పనిచేసి ముడిసరుకు కొరతతో మూతపడింది. ఈ బయో-మాస్ ప్లాంట్లు తురిమిన ఫైబర్‌ను కాల్చి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ ఫైబర్‌ను సేంద్రీయ ఎరువుగా వాడవచ్చని సొసైటీ సూచించినా పట్టించుకోలేదు. రూ. 40 కోట్లతో 8 మెగావాట్ల సౌరశక్తి ప్లాంట్ నిర్మించి ఉంటే, 365 రోజులూ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరిగేదని, కానీ అలా చేయలేదని ఉమామహేశ్వర్ రెడ్డి, పుల్లయ్య ఆరోపించారు.

నీటి శుద్ధి ప్లాంట్లు…
రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి, భద్రాద్రి జిల్లా అప్పారావుపేటలో నిర్మించిన శుద్ధి చేసిన తాగునీటి బాట్లింగ్ ప్లాంట్లు ఆయిల్ ఫెడ్ అసమర్థతకు అద్దం పడతాయి. ఈ ప్లాంట్లు మూతపడ్డాక లీజుకు ఇవ్వడానికి టెండర్లు పిలవడం శోచనీయమని వారు విమర్శించారు. శివరాంపల్లిలోని ఆటోమేటెడ్ ప్లాంట్‌కు గత ఏడాది డిసెంబర్ 18న టెండర్ నోటీసు జారీ చేయడంపై మండిపడ్డారు. ఇన్ని అక్రమాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోకపోతే పామాయిల్ రైతులు నష్టపోతారని సొసైటీ నేతలు హెచ్చరించారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *