- రాష్ట్రంలో హైఅలర్ట్… సీఎం రేవంత్ ఆదేశాలు
- ఫేక్ న్యూస్పై ఉక్కుపాదం… సోషల్ మీడియాపై నిఘా
- బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు సిద్ధం చేసుకోవాలి
- అక్రమ వలసదారులపై చర్యలు…
సహనం వందే, హైదరాబాద్:
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ సైన్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు.
కీలక ఆదేశాలు:
- దేశ సైన్యానికి మద్దతు: దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావు లేదు.
- అత్యవసర సేవలపై దృష్టి: అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేయబడ్డాయి. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలి. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి.
- విదేశీ పర్యటనలు రద్దు: మంత్రులు, అధికారులు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లకూడదు.
- సోషల్ మీడియాపై నిఘా: ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
- టోల్ ఫ్రీ నెంబర్: ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి.
- అక్రమ వలసదారులపై చర్యలు: పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి.
- కమాండ్ కంట్రోల్ సెంటర్: కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
- శాంతి భద్రతల పరిరక్షణ: శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి.
- వైద్య సదుపాయాలు: బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు సిద్ధం చేసుకోవాలి. అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలి.
- ఆహార నిల్వలు: ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి.
- సైబర్ భద్రత: సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలి.
- ఫేక్ న్యూస్పై ఉక్కుపాదం: ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి.
- సీసీ కెమెరాల అనుసంధానం: రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయాలి.
- భద్రతా చర్యలు: అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలి. హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల వద్ద, ఐటీ సంస్థల వద్ద భద్రతను పెంచాలి.
- పోలీసుల అప్రమత్తత: హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్లపై, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలి.