‘సృష్టి’ వైద్యాధికారులపై చర్యలు? – తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు

సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ఆ వ్యవహారం వెనక ఉన్న అధికారులు ఎవరో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వైద్యాధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ ‘సహనం వందే’ ప్రతినిధితో మాట్లాడుతూ… సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తున్నట్లు…

Read More

విత్తనాల దందా… అధికారుల అండ – అధిక ధరలతో అన్నదాత లూటీ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరకు విక్రయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోయాబీన్ విత్తనాల కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం రూ. 2,400 మాత్రమే కాగా… కొందరు వ్యాపారులు రైతుల నుంచి రూ. 2,600 వరకు…

Read More

‘సృష్టి’కి వైద్యాధికారి అండదండ… నకిలీ ఐవీఎఫ్ సెంటర్లకు అనుమతులు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ యూనివర్సల్ ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతకు హైదరాబాదుకు చెందిన ఒక కీలక వైద్యాధికారి అండదండలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమెపై అనేక ఫిర్యాదులు రావడం… కేసులు నమోదు కావడం జరిగింది. అయినప్పటికీ ఆ ఫెర్టిలిటీ సెంటర్ కు అన్ని విధాలుగా ఆ అధికారి అనుమతులు ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. ఆమె చేస్తున్న అక్రమాల్లో ఆయనకు కూడా వాటా ఉందన్న ప్రచారం జరుగుతుంది. సంతానం లేని దంపతులను మోసం చేస్తూ కోట్లు…

Read More

లైవ్ సర్జరీల వ్యాపారానికి చెక్ – ప్రైవేట్ ఆసుపత్రులకు కేంద్రం ముకుతాడు

సహనం వందే, న్యూఢిల్లీ:ప్రైవేట్ ఆసుపత్రుల్లో లైవ్ సర్జరీలు నిర్వహించే విధానంలో రోగుల భద్రత, నైతిక ప్రమాణాలను కాపాడేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. లైవ్ సర్జరీ లకు తప్పనిసరిగా ఎన్ఎంసీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోవాలి. రోగుల భద్రతను ఫణంగా పెట్టి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ సర్జరీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఎన్ఎంసీ కఠిన నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఆసుపత్రులు, సర్జన్లు, వైద్య సంస్థలు అమలు…

Read More

రాష్ట్ర జడ్జీల సంఘం ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర జడ్జీల సంఘం అధ్యక్షుడిగా జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. సంఘం ఎన్నికలు ఈ నెల 19న జరిగాయి. ఈ ఎన్నికలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా పర్యవేక్షించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తికావడంతో, విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికలు న్యాయవ్యవస్థలో నూతన నాయకత్వానికి మార్గం సుగమం చేశాయి. వారి నాయకత్వంలో తెలంగాణ…

Read More

శ్రావణం ఆధ్యాత్మిక సంగమం

శ్రావణమాసం అనేది హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రత కలిగిన మాసం. ‘శ్రవణ’ అనే నక్షత్రంతో ఈ మాసం ప్రారంభమవుతుంది కనుక దీనికి శ్రావణం అనే పేరు వచ్చింది. ఈ మాసం అంతటా భక్తిపరవశం, పూజాపారాయణలు, ఆచారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శివునికి ఇది ప్రీతికరమైన కాలంగా చెప్పబడుతుంది. ఈ మాసంలో వచ్చే సోమవారాలు ‘శ్రావణ సోమవారాలు’గా ప్రసిద్ధి చెందాయి. భక్తులు ఉపవాసంతో శివుడికి అభిషేకాలు చేసి, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. వనమూలికలతో చేసిన పూజా ద్రవ్యాలు ప్రకృతి సౌందర్యాన్ని…

Read More

రాహుల్ కుల జ్ఞానోదయం – కాంగ్రెస్ నేత ఆత్మ విమర్శ వెనుక రాజకీయం

సహనం వందే, న్యూఢిల్లీ:మూడోసారి కూడా అధికారం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి, దాని అధినేత రాహుల్ గాంధీకి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. దేశంలో కులగణన జరగకపోవడం తన తప్పేనని, అది పార్టీ తప్పు కాదని రాహుల్ శుక్రవారం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తప్పును ఇప్పుడు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. కుల గణన ఆవశ్యకతపై వ్యాఖ్యలు…కుల గణన ఆవశ్యకతపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ… సమాజంలోని వివిధ వర్గాల…

Read More

పాత వివాదాలు… కొత్త అనుమానాలు! చంద్రబాబు సింగపూర్ పర్యటనపై సందేహాలు

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించాలనే నినాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌ పర్యటనకు బయలుదేరుతుండగా, గతంలో ఈ దేశంతో జరిగిన వివాదాస్పద ఒప్పందాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు సహా ఎనిమిది మంది బృందం పాల్గొననుంది. మళ్లీ అదే బాటలో పయనమా?సింగపూర్‌లో ముఖ్యమంత్రి…

Read More

మోడీ గుండెల్లో ధన్‌ఖడ్‌ దడ -నరేంద్రుడికి ఉపరాష్ట్రపతి ఝలక్

సహనం వందే, న్యూఢిల్లీ:ఎవరి మాటా వినని… తన మాటే శాసనం అన్న తీరుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న నరేంద్ర మోడీ శకానికి తెరపడుతోందా? ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక ప్రధాని మోడీతో పెరిగిన విభేదాలే కారణమని స్పష్టమవుతోంది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివాదం పతాక స్థాయికి చేరడం, మోడీ అవిశ్వాస హెచ్చరికలకు ధన్‌ఖడ్‌ రాజీనామాతోనే బదులివ్వడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మోడీ నాయకత్వానికి ధన్‌ఖడ్‌ ఉదంతం బ్లడ్‌ ఆన్‌…

Read More

అన్నయ్య వర్సెస్ తమ్ముడు-నాగబాబుకు మంత్రి పదవిపై సందిగ్ధత

సహనం వందే, అమరావతి:నాగబాబుకు మంత్రి పదవిపై సాగుతున్న ఊహాగానాలు, చర్చలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా ఇచ్చిన వివరణ కొత్త మలుపునిచ్చింది. సోదరుడు నాగబాబు మంత్రి అవుతారా? రాజ్యసభ సభ్యుడవుతారా? కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కుతుందా? అనే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమాధానాలు ఇవ్వకపోయినా, ఈ వ్యవహారం వెనుక పవన్ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పవన్ చేతిలోనే నాగబాబు మంత్రి పదవి!నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read More