‘ఆర్ఎస్ఎస్’ పై కేరళ టెక్కీ సూసైడ్ బాంబ్

సహనం వందే, న్యూఢిల్లీ:కేరళకు చెందిన ఒక ఐటీ ఇంజనీర్ అనందు అజి ఆత్మహత్య దేశ రాజకీయాలను ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూలాలను కుదిపేస్తోంది. అనందు రాసిన 15 పేజీల సూసైడ్ నోట్ బయటపడటంతో ఇది కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా ఒక సంస్థాగత విషాదంగా మారింది. బాల్యంలో ‘ఆర్ఎస్ఎస్’ శిబిరాల్లో, సభ్యుల చేతుల్లో తాను లైంగిక, శారీరక వేధింపులకు గురయ్యానని, తన శరీరాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకున్నారని, బ్యాటన్‌లతో కొట్టేవారని ఆ యువకుడు ఆరోపించడంతో…

Read More

ఏఐజీ ‘ఠాగూర్ సినిమా’ – శవాన్ని దాచి… డబ్బు దోచి

సహనం వందే, హైదరాబాద్:పేదల ప్రాణాల కన్నా చివరి పైసా వసూలే ముఖ్యమనే కార్పొరేట్ హాస్పిటల్స్ దురాశకు హైదరాబాద్‌లోని ఏఐజీ సాక్ష్యంగా నిలిచింది. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన 40 ఏళ్ల మురళీధర్ అనే వ్యక్తి ప్రాణం పోయినా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి వరకు డబ్బు పిండుకుని చివరకు డెడ్ బాడీని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టిన దారుణ ఘటన ఇది. తమ కుటుంబ పెద్దను బతికించుకోవడానికి ఇల్లు అమ్ముకుని సర్వం కోల్పోయిన ఆ కుటుంబం…

Read More

శాంతి వేదికపై ‘విజయనగర’ గళం – ప్రపంచ వేదికపై ఎంపీ అప్పలనాయుడు

సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్‌లోని శాంతివనం ఆధ్యాత్మిక, రాజకీయ సందడితో నిండిపోయింది. బ్రహ్మకుమారిస్ గ్లోబల్ సమ్మిట్-2025 శనివారం ఘనంగా మొదలైంది. కేంద్ర మంత్రులు కైలాస్ విజయ్ వర్గీయ, దుర్గాదాస్ ఉయకే ముఖ్య అతిథులుగా… విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా హాజరై జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సామరస్యం, సుస్థిరమైన భవిష్యత్తు సాధన కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ అడుగులు వేస్తోంది. యుద్ధం వద్దు… శాంతికే…

Read More

బీజేపీ రాగం… టీడీపీ విలాపం – తెలంగాణ తెలుగుదేశం నేతల నిరాశ

సహనం వందే, అమరావతి/హైదరాబాద్:తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సుదీర్ఘ కాలం తర్వాత కదిలినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర టీడీపీ నేతలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని… ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని పార్టీ నేతలే వ్యాఖ్యానించడం టీడీపీకి దిశానిర్దేశం లేకపోవడాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ…

Read More

బాడీ షేమింగ్… బహుజనుల ఫైటింగ్ – దున్నపోతు వ్యాఖ్య దుమారం…

సహనం వందే, హైదరాబాద్:బహుజనుల మధ్య సఖ్యత కొరవడింది. బీసీ, ఎస్సీల మధ్య ఉండాల్సిన ఐక్యత దెబ్బతింటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు బహుజన మంత్రుల మధ్య ఉన్న వర్గ వైరం చినికి చినికి గాలివానలా మారుతోంది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దున్నపోతు చుట్టూ దుమారం రేపాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి….

Read More

దళిత ‘సుప్రీం’పై దమనకాండ – ప్రధాన న్యాయమూర్తిపైనే కులోన్మాదం

సహనం వందే, న్యూఢిల్లీ:ఈ దేశంలో అత్యున్నత పదవుల్లోని బహుజన, దళిత వర్గాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. దేశ మాజీ రాష్ట్రపతి కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి… ఇద్దరూ దళితులే కావడంతో వారిపై అడుగడుగునా కులోన్మాదులు అనేక విధాలుగా మానసికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై న్యాయవాది రాకేష్ కిశోర్ బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. విచారణ సమయంలో సనాతన ధర్మాన్ని…

Read More

బీసీ కోటా… కోర్టుల్లో రగడ – 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో సవాల్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ న్యాయపరమైన జోక్యం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్…

Read More

రిజర్వేషన్ల ‘తప్పు’టడుగు – చిత్రవిచిత్రంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన తప్పులు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఓటరు లేని చోట పదవుల రిజర్వేషన్లు కల్పించడం వెనుక దాగి ఉన్న రాజకీయం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యంగా రూపొందిన రిజర్వేషన్లు అస్తవ్యస్తమైన డేటా ఆధారంగా కేటాయించడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియే అపహాస్యం అవుతోందని విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ తప్పిదాల కారణంగా పలు గ్రామాల్లో ఎన్నికలు జరగకముందే ఏకగ్రీవాలు ఖాయమవుతున్నాయి….

Read More

అప్పలనాయుడికి ‘చంద్ర’హారం – కలిశెట్టి సూపర్… చంద్రబాబు సర్టిఫికెట్

సహనం వందే, విజయనగరం:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. దత్తి గ్రామంలో బుధవారం పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎంపీ అప్పలనాయుడు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న విధానం ప్రశంసనీయమని కొనియాడారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను శక్తివంతంగా నిర్వహిస్తూ తెలుగుదేశంను ప్రాణంగా చూసుకుంటున్నారని సభా వేదికగా ప్రశంసించారు. ఈ కామెంట్లతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. సేవ…

Read More

పటిష్ట వ్యూహంతో పదేళ్లు పాగా – మరో రెండు మార్లు సీఎం కుర్చీలో కర్చీఫ్

సహనం వందే, హైదరాబాద్:‘నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. హైదరాబాదును న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు ఆ సిటీలకు పోటీగా నిర్మించకూడదు? ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామ’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనూ… రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారాయి. తనకు మరో పదేళ్లు…

Read More