ఢిల్లీతో రేవంత్ రె’ఢ్డీ’ – బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతోనే కొట్లాట

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు…

Read More

అక్రమ సంబంధాల ‘కాంచీపురం’ – దేశంలోనే మొదటి స్థానం నిలిచిన పుణ్యక్షేత్రం

సహనం వందే, హైదరాబాద్:మారుతున్న జీవనశైలితోపాటు సంబంధాలు, అనుబంధాలు కూడా మారతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు దేశంలో విపరీతంగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంబంధాల మోజులో పడి కట్టుకున్నవాళ్ళనే కడతేర్చిన ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మేఘాలయలో భర్తను చంపిన భార్య ఉదంతం… అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త పెళ్లికొడుకును కడతేర్చిన నవ వధువు ఉదంతాలు ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలకు కాంచీపురం అడ్డాగా మారిందని ప్రముఖ డేటింగ్ యాప్ వెల్లడించిన…

Read More

యూరియా కోసం…. గడప దాటండి… ఢిల్లీ వెళ్లండి…

సహనం వందే, హైదరాబాద్:ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో పంటల సాగు ఊపందుతుంది. ఇంతటి కీలక సమయంలో యూరియా అత్యవసరం. అందుకోసం అన్నదాత ఎదురుచూస్తున్నారు. కానీ యూరియా అందుబాటులో లేకుండా పోయింది. దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉండటంతో సాగు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆరోపిస్తుంది. మంత్రి తుమ్మల…

Read More

బీహార్ లో జర్నలిస్టులకు 15 వేల పెన్షన్

సహనం వందే, హైదరాబాద్:జర్నలిస్టుల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఉద్యోగ భద్రత కరువైంది. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నిస్సహాయ స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పత్రికా యాజమాన్యాలు వీరిని పట్టించుకోకపోగా, చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తుంటే, తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో జర్నలిస్టులను విస్మరించాయి. ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి కీలకమైన విషయాల్లో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోంది. బీహార్‌లో పెరిగిన పెన్షన్…తాజాగా…

Read More

ముఖ్యమంత్రికి విన్నవించినా…ఆగని ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల ఆగడాలు

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఆధ్వర్యంలో గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు సార్లు విన్నవించారు. అయినా ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. కొందరు సీనియర్ అధికారులు, కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన కీలక అధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,…

Read More

ఎన్ఎంసీ స్కాన్… మెడికల్ స్కామ్ – తనిఖీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల బండారం

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా మారుతోంది. డబ్బుల కోసం కాలేజీలు పెట్టిన కొందరు బడా బాబులు నాసిరకం వైద్య విద్య అందిస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప మరో ఆలోచన లేకపోవడంతో ఆయా కాలేజీలు కునారిల్లిపోతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించక… బోధన సిబ్బంది పూర్తిస్థాయిలో లేక వైద్య విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్యలో…

Read More

మహావీర్ గుప్పిట్లో ఎన్ఎంసీ -లంచం తీసుకున్నందుకు కృతజ్ఞతాభావం

సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) దారి తప్పిపోయింది. లంచాల రుచికి మరిగిన ఎన్ఎంసీ బృందాలు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. దేశంలో అనేక చోట్ల సీబీఐ కేసులు పెడుతూ కొందరిని అరెస్టు చేస్తున్నా… ఎన్ఎంసీ అధికారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ముడుపులు తీసుకుని ముందే కమిట్మెంట్లు ఇవ్వడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చెట్టాపట్టాల్ వేసుకొని దర్జాగా తిరుగుతూనే ఉన్నాయి. అందుకు నిలువెత్తు ఉదాహరణ వికారాబాద్ లో ఉన్న మహావీర్…

Read More

ప్రముఖులు జైళ్లలో అతిథులు – డబ్బుంటే జైళ్లు గెస్ట్ హౌస్ లే

సహనం వందే, రాజమండ్రి:‘జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటా’… ఈ వ్యాఖ్య చేసింది ఎవరో కాదు… తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. ధనికులకు చట్టం చుట్టం అవుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తప్పుచేసి జైలుకు వెళ్లినప్పటికీ వారికి రాచ మర్యాదలు కల్పిస్తారు. ఒకప్పుడు జగన్… తర్వాత రేవంత్ రెడ్డి..‌. చంద్రబాబు నాయుడు… కవిత.‌.‌. ఇప్పుడు మిధున్ రెడ్డి. వీళ్ళందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. జైళ్లు ఒకరకంగా ధనికులకు విశ్రాంతి కేంద్రాలుగా మారిపోవడం దురదృష్టకరం. ఎంత డబ్బు చెల్లిస్తే అన్ని…

Read More

డాక్టర్ల ఫేక్(స్) రికగ్నేషన్ – మెడికల్ కాలేజీలకు కొత్త సమస్య

సహనం వందే, హైదరాబాద్:మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల హాజరు విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చెబుతోంది. అయితే ఈ చర్యలను ఛేదించే విధంగా కొన్ని కంపెనీలు కొత్త యాప్‌లతో ముందుకొచ్చాయి. ఇంటి నుంచే ముఖ గుర్తింపు ద్వారా హాజరు వేసుకునే సౌలభ్యాన్ని కేవలం రూ.7000కే అందిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు వైద్య విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బొటనవేలు నుంచి ముఖ గుర్తింపు వరకువైద్య కళాశాలల్లో అధ్యాపకుల హాజరు కోసం గతంలో…

Read More

వైద్య విద్యకు ‘ఎన్ఎంసీ’ చెద – అవినీతి అడ్డా జాతీయ మెడికల్ ‘కమీ’షన్

సహనం వందే, హైదరాబాద్:భారత వైద్య విద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’ బాంబు పేల్చింది! జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వ్యవస్థీకృత అవినీతికి, అసమర్థతకు నిలయంగా మారిందని ఘాటుగా విమర్శించింది. జులై 19న ప్రచురితమైన ఈ సంచలనాత్మక నివేదిక… భారత వైద్య విద్య భవిష్యత్తును, ప్రజల ఆరోగ్య సంరక్షణ నాణ్యతను అంధకారంలోకి నెట్టేస్తోందని హెచ్చరించింది. ఎన్‌ఎంసీ అక్రమాల పుట్ట అని దునుమాడింది. లంచాల బాగోతం… వ్యవస్థకే చీడజూన్ 30న…

Read More