హిందీ వర్సెస్ మరాఠీ వర్సెస్ కన్నడ

మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. హిందీకి వ్యతిరేకంగా రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే వంటి రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందీని తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటం చేసేందుకు రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలు సంసిద్ధత వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం భాషాభిమానమా? లేక రాజకీయ ఎత్తుగడా?

కేంద్ర ప్రభుత్వం హిందీని తప్పనిసరి చేయాలన్న నిర్ణయం మహారాష్ట్రలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మరాఠీ భాష, సంస్కృతిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో రాజకీయ ప్రత్యర్థులైన రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలు ఒకే వేదికపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కుటుంబ వివాదాలను పక్కనపెట్టి కలసి రావాలని సూత్రపాయంగా నిర్ణయించారు. ఉద్ధవ్ థాకరే కూడా మరాఠీ సమాజం ప్రయోజనాల కోసం ఐక్యతకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేల మధ్య దశాబ్దాలుగా తీవ్ర వైరం ఉంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీల మధ్య రాజకీయ విభేదాలు, వ్యక్తిగత గొడవలు ఐక్యతకు పెద్ద అడ్డంకిగా మారాయి. అయితే హిందీ తప్పనిసరిగా అమలు చేయాలనే నిర్ణయం మరాఠీ గుర్తింపు, స్థానిక భాషకు ముప్పుగా పరిణమించింది. ఈ నేపద్యంలో ఇద్దరు నాయకులు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి వచ్చే అవకాశం కనిపిస్తోంది

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *