తెలంగాణ కలెక్టర్… ఏపీ మంత్రికి కనెక్ట్ – ఒక్క ఫోన్ తో పని చేసిపెట్టిన ఉన్నతాధికారి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మంత్రుల ఆదేశాలను పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారుల వైఖరిపై తీవ్ర చర్చకు దారితీసింది. సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి తన భూమి వివరాలు సరిచేయడానికి ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ని రోజులు గడిచినా సొంత మంత్రి ఆదేశించినా స్పందించని కలెక్టర్… చివరకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి చేసిన ఒక్క…

Read More

‘జెన్ జెడ్’ మంటల్లో మడ్ గాస్కర్ అధ్యక్షుడు

సహనం వందే, మడ్ గాస్కర్:‘జెన్ జెడ్’ మంటల్లో మడ్ గాస్కర్ అధ్యక్షుడు తిరుగుబాటుతో మడ్ గాస్కర్ అధ్యక్షుడు అండ్రీ రాజోయెలినా దేశం విడిచి పారిపోవడం ప్రపంచ రాజకీయాలను ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. వేలాది మంది యువకులు అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉద్ధృతం చేయడంతో ఆర్మీ కూడా సహకరించింది. సైన్యం మద్దతు కోల్పోయిన రాజోయెలినా రహస్యంగా దేశం వదిలి వెళ్లిపోయాడు. రాజోయెలినా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒప్పందం చేసుకుని ఫ్రెంచ్ సైనిక విమానంలో పారిపోవడం…

Read More

‘ఆర్ఎస్ఎస్’ పై కేరళ టెక్కీ సూసైడ్ బాంబ్

సహనం వందే, న్యూఢిల్లీ:కేరళకు చెందిన ఒక ఐటీ ఇంజనీర్ అనందు అజి ఆత్మహత్య దేశ రాజకీయాలను ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూలాలను కుదిపేస్తోంది. అనందు రాసిన 15 పేజీల సూసైడ్ నోట్ బయటపడటంతో ఇది కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా ఒక సంస్థాగత విషాదంగా మారింది. బాల్యంలో ‘ఆర్ఎస్ఎస్’ శిబిరాల్లో, సభ్యుల చేతుల్లో తాను లైంగిక, శారీరక వేధింపులకు గురయ్యానని, తన శరీరాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకున్నారని, బ్యాటన్‌లతో కొట్టేవారని ఆ యువకుడు ఆరోపించడంతో…

Read More

ఏఐజీ ‘ఠాగూర్ సినిమా’ – శవాన్ని దాచి… డబ్బు దోచి

సహనం వందే, హైదరాబాద్:పేదల ప్రాణాల కన్నా చివరి పైసా వసూలే ముఖ్యమనే కార్పొరేట్ హాస్పిటల్స్ దురాశకు హైదరాబాద్‌లోని ఏఐజీ సాక్ష్యంగా నిలిచింది. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన 40 ఏళ్ల మురళీధర్ అనే వ్యక్తి ప్రాణం పోయినా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి వరకు డబ్బు పిండుకుని చివరకు డెడ్ బాడీని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టిన దారుణ ఘటన ఇది. తమ కుటుంబ పెద్దను బతికించుకోవడానికి ఇల్లు అమ్ముకుని సర్వం కోల్పోయిన ఆ కుటుంబం…

Read More

అద్దె భార్య… అంతులేని వ్యధ – థాయ్‌లాండ్ పర్యాటకంపై విమర్శల వెల్లువ

సహనం వందే, బ్యాంకాక్:థాయ్‌లాండ్ పర్యాటకం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న ఒక చీకటి ధోరణి ప్రపంచ మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. పట్టాయా వంటి నగరాల్లో విదేశీ పర్యాటకులు తాత్కాలికంగా భార్యలను అద్దెకు తీసుకునే ఈ పోకడ ఆర్థిక అవసరాల పేరుతో మహిళలను వస్తువుల్లా మార్చే ప్రమాదకరమైన దోపిడీగా మారింది. రచయిత లావెర్ట్ ఎమ్మాన్యుయేల్ తన పుస్తకంలో బయటపెట్టిన ఈ అమానవీయ వాస్తవం ప్రపంచవ్యాప్తంగా సామాజిక నైతికతపై తీవ్ర చర్చకు దారితీసింది. ఇది…

Read More

ఏ దారి ఎటు పోతుందో! – స్వదేశీ ‘మ్యాపుల్స్’ మహాద్భుతం!

సహనం వందే, హైదరాబాద్:గూగుల్‌ మ్యాప్‌కు గట్టి పోటీనిస్తూ మ్యాప్స్‌ మై ఇండియా సంస్థ రూపొందించిన ‘మ్యాపుల్స్’ యాప్‌ ఆకర్షిస్తుంది. మన రోడ్ల సంక్లిష్టతకు అనుగుణంగా తయారుచేసిన ఈ నావిగేషన్ యాప్ 3.5 కోట్ల డౌన్‌లోడ్లతో దూసుకుపోవడమే కాకుండా గోప్యత, భద్రతకు పెద్దపీట వేస్తుంది. ఇస్రో భాగస్వామ్యంతో ఉపగ్రహ చిత్రాల డేటాను ఉపయోగించుకోవడం ద్వారా మ్యాప్ ఖచ్చితత్వాన్ని అమాంతం పెంచింది. 13 అద్భుత ఫీచర్లు…ఇందులో 13 అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల వద్ద మూడు డైమెన్షనల్…

Read More

ఏడు అడుగులకు… అరవై లక్షలు – అబ్బాయిలకు మ్యారేజ్ బ్యూరో కండీషన్

సహనం వందే, హైదరాబాద్:పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అని మన సంప్రదాయం చెబుతోంది. కానీ‌ ఏఐ యుగంలో పెళ్లి సంబంధాలు కూడా పక్కా వ్యాపారంగా మారిపోయాయని ఒక కొత్త పరిణామం రుజువు చేస్తోంది. దేశంలో పెళ్లి సంబంధాల కోసం ఏర్పాటు అయిన నాట్(Knot) డేటింగ్ యాప్… అబ్బాయిల వార్షిక ఆదాయం కనీసం రూ. 60 లక్షలు ఉండాలని కఠిన షరతు విధించింది. అమ్మాయిలకు మాత్రం ఎలాంటి ఆదాయ పరిమితి పెట్టకుండా వివాదానికి కేంద్రంగా మారింది. సంప్రదాయ…

Read More

మానవ హక్కుల బ్రోకర్లకు నోబెల్ – ఇజ్రాయిల్ మద్దతుదారు మచాడో ఎంపిక

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మరోసారి తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. 2025 సంవత్సరానికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు ఈ పురస్కారం దక్కడం నోబెల్ కమిటీ పశ్చిమ దేశాల రాజకీయ అజెండాను అమలు చేస్తోందనడానికి తాజా నిదర్శనం. అహింసా మార్గంలో ప్రపంచానికి స్వాతంత్య్ర సిద్ధాంతాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీకి ఐదుసార్లు నామినేషన్ వేసినా దక్కని ఈ గౌరవం… వెనెజులాలో సోషలిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన మచాడోకు లభించడం…

Read More

శాంతి వేదికపై ‘విజయనగర’ గళం – ప్రపంచ వేదికపై ఎంపీ అప్పలనాయుడు

సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్‌లోని శాంతివనం ఆధ్యాత్మిక, రాజకీయ సందడితో నిండిపోయింది. బ్రహ్మకుమారిస్ గ్లోబల్ సమ్మిట్-2025 శనివారం ఘనంగా మొదలైంది. కేంద్ర మంత్రులు కైలాస్ విజయ్ వర్గీయ, దుర్గాదాస్ ఉయకే ముఖ్య అతిథులుగా… విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా హాజరై జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సామరస్యం, సుస్థిరమైన భవిష్యత్తు సాధన కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ అడుగులు వేస్తోంది. యుద్ధం వద్దు… శాంతికే…

Read More

కులోన్మాదం… ఐపీఎస్ ఆత్మ’బలి’దానం- డీజీపీ స్థాయి అధికారిపైనే దళిత వివక్ష

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో కులం అనే విషం ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి నిరూపించే దారుణ ఘటన ఇది. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య కేవలం ఒక వ్యక్తి విషాదాంతం కాదు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఒక దళిత అధికారి తన తోటి అధికారుల చేతిలో మానసిక హింసకు, జాతి వివక్షకు ఎలా బలైపోయాడో తెలిపే పచ్చి నిజం. చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణం చెందడం దేశంలోని…

Read More