సహనం వందే, హైదరాబాద్:
అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి జర్నలిజంలో 16 ఏళ్ళకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్ వంటి ప్రముఖ పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. స్పీకర్ ఉత్తర్వుల ప్రకారం, ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.
సభ్యులుగా ఆంజనేయులు, రంగారావు, పూర్ణ
మొత్తం 15 మంది సభ్యులతో అసెంబ్లీ మీడియా సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలికి చైర్మన్గా ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు కో-చైర్మన్గా పోలోజు పరిపూర్ణాచారి నియమితులయ్యారు. మండలి సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులైన అయితరాజు రంగారావు, బొడ్లపాటి పూర్ణచందర్ రావు, ఎల్ వెంకట్రాంరెడ్డి, పోలంపల్లి ఆంజనేయులు, ఎం పవన్ కుమార్, భీమనపల్లి అశోక్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సురేఖ అబ్బూరి, మహమ్మద్ నయీమ్ వజాహత్, బసవపున్నయ్య, ప్రమోద్ కుమార్ చతుర్వేది, సుంచు అశోక్, బీహెచ్ఎంకే గాంధీ నియమితులయ్యారు. ఈ మండలి అసెంబ్లీకి, మీడియాకు మధ్య వారధిగా పని చేయనుంది.


