- ఉత్తరాఖండ్ లో నిర్మించారని నటి వెల్లడి
- మీమ్స్తో ముంచెత్తిన నెటిజన్లు
- ఆన్లైన్ బుకింగ్స్ ఎప్పుడని కామెంట్స్
సహనం వందే, హైదరాబాద్:
నటి ఊర్వశి రౌటేలా తన పేరుతో ఉత్తరాఖండ్లో ఆలయం ఉందని చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఒక ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ, ఉత్తరాఖండ్లో తన పేరు మీద ఒక ఆలయం ఉందని చెప్పారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ఇది గొప్ప నిదర్శనమని ఆమె అన్నారు. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉందో, దాని వివరాలేంటో చెప్పకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఆలయంలో ఆన్లైన్ బుకింగ్ ఎప్పుడు?
ఊర్వశి వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్లలో వందల కొద్దీ మీమ్స్ వెల్లువెత్తాయి. కొందరు ఆమెను దేవతగా చూపిస్తూ ఫన్నీగా ప్రార్థనలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఊర్వశి దేవి ఆలయంలో ఆన్లైన్ బుకింగ్ ఎప్పుడు మొదలవుతుంది?’ అని అడిగితే, మరొకరు ‘ఆలయంలో ఫోటోషూట్కు పర్మిషన్ ఉందా?’ అని సరదాగా కామెంట్ చేశారు. ఊర్వశి గతంలో కూడా తన మాటలతో వివాదాలు సృష్టించారు. ఈ ఆలయం విషయం కొందరికి అభిమానుల ప్రేమగా అనిపించినా, మరికొందరు దీన్ని పబ్లిసిటీ కోసం చేస్తున్నారని భావిస్తున్నారు. ఊర్వశి రౌటేలా బాలీవుడ్లోనే కాకుండా సౌత్ సినిమాల్లోనూ నటించారు. పలు హిట్ సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. సోషల్ మీడియాలో ఆమెకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.