sahanamvande@gmail.com

అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి జర్నలిజంలో 16 ఏళ్ళకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్ వంటి ప్రముఖ పత్రికల్లో వివిధ హోదాల్లో…

Read More

చలమేడ ఆనందరావు మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్లపై ఉక్కుపాదం

సహనం వందే, కరీంనగర్:కరీంనగర్‌లోని చలమేడ ఆనందరావు మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం వైద్య విద్యా రంగంలో ప్రైవేట్ సంస్థల నిరంకుశ పోకడలకు, విద్యార్థుల హక్కుల అణచివేతకు నిదర్శనం. తమ పెండింగ్ స్టైపెండ్‌ల గురించి మేనేజ్‌మెంట్‌ను నిలదీసినందుకు వారిపై ఉక్కు పాదం మోపారు. స్టైపెండ్‌ల జాప్యంపై నిరసన…డాక్టర్స్ డే రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులు తమ స్టైపెండ్లు నెలల తరబడి చెల్లించకపోవడంపై గళమెత్తారు….

Read More

సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ మారణహోమంపై మౌనం

సహనం వందే, హైదరాబాద్:కాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక ప్రజలను ఉగ్రవాదులు కాల్చి చంపితే… కేంద్ర ప్రభుత్వం ఏకంగా పాకిస్తాన్ తో యుద్ధమే చేసింది. అందుకు సహకరించిన వారిపై దేశద్రోహం కేసు పెట్టి లోన పడేసింది. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలంటే ఇలా చేయాల్సిందే. కానీ హైదరాబాదు శివారు పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి ఏకంగా 43 మందికి పైగా చనిపోవడం… దాదాపు అంతే సంఖ్యలో గల్లంతు…

Read More

యూరియా ‘అధికారి’ దయ – ఎక్కడికక్కడ బ్లాక్…

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో యూరియా కొరత ఉందని… కేంద్రం అవసరమైనంత కేటాయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. సీజన్ ఊపందుకోవడంతో ఆయన కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారు. 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇంకేం ఇదే అదనుగా భావించిన మార్క్ ఫెడ్ లోని ఒక అధికారి దళారులతో చేతులు కలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేయిస్తున్నట్టు పెద్ద ఎత్తున…

Read More

ఆయిల్ పామ్ అక్రమార్కులకు చుక్కలే

సహనం వందే, అశ్వారావుపేట: ఆయిల్ పామ్ మొక్కల్లో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (ఐఐఓపీఆర్) బృందం మూడు రోజులు పర్యటించింది. గురువారంతో వారి పర్యటన ముగిసింది. వర్షంలోనూ ఆ బృందం పట్టుదలగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం విశేషం. ఈ మూడు రోజుల్లో శాస్త్రవేత్తల బృందం 3 వేల ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించింది. ఇందులో నుంచి 100 నమూనాలను…

Read More

డాక్టర్లకు సీబీఐ బేడీలు – మెడికల్ కాలేజీల అనైతిక చర్య

సహనం వందే, హైదరాబాద్:ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వైద్య కళాశాలకు గుర్తింపు ఇచ్చేందుకు ఏకంగా రూ. 55 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ ముగ్గురు వైద్యులతో సహా ఆరుగురిని అరెస్టు చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల గుర్తింపు ప్రక్రియలో పేరుకుపోయిన అవినీతిని మరోసారి బట్టబయలు చేసింది. సీబీఐ అధికారులు ఈ కేసులో కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ ప్రాంతంలో ఉన్న శ్రీ…

Read More

ఆయిల్ ఫెడ్ తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటు.. ఫైనాన్స్ విభాగం తొలగింపు

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ లో ప్రక్షాళన పర్వం ఊపందుకుంది. ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ వరుస కథనాలతో ఈ కార్పొరేషన్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మొక్కల అక్రమాలు, నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణ వివాదం… కొందరు అధికారులు కీలకమైన విభాగాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దోపిడీకి పాల్పడుతుండటం… ఇలాంటి అన్ని విషయాలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కార్పొరేషన్ కొత్త ఎండీ శంకరయ్య…

Read More

ప్రతీ కులానికి గ్రేడింగ్‌ … 242 కులాలకు…

సహనం వందే, హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే గణాంకాల ఆధారంగా స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతి కులానికి గ్రేడింగ్‌ ఇచ్చింది. సర్వే వివరాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స‍్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణ చేసిన అనంతరం రాష్ట్రంలోని 242 కులాలకు గ్రేడింగ్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. పది రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర…

Read More

ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరి… ఒంటరితనం పెనుభూతం

సహనం వందే, జెనీవా:ఆధునిక జీవనశైలిలో ఒంటరితనం ఒక పెనుభూతంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం సంచలన నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని తెలిపింది. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌ఓ కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఒంటరితనం వల్ల ప్రతి గంటకు సుమారు వంద మంది మరణిస్తున్నారని వెల్లడించింది. అంటే సంవత్సరానికి…

Read More

ఆయిల్ పామ్ నర్సరీల్లో నాసిరకం మొక్కలా? – తుమ్మల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగులో నెలకొన్న మందకొడి పరిస్థితిపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నర్సరీల్లో నాసిరకం మొక్కలు (కల్లింగ్ మొక్కలు) ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మొక్కలు ఏ మాత్రం ఉండకూడదని… రైతులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన వాటినే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో మంగళవారం ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఆయిల్ పామ్ సాగు పురోగతి, ఇతర ఉద్యాన పంటల స్థితిగతులపై…

Read More