sahanamvande@gmail.com

కృష్ణా, గోదావరి నదీ జలాలపై కీలక ఒప్పందం

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై నెలకొన్న సమస్యలకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, దీనిని తెలంగాణకు ఒక విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

విదేశీ ఎంబీబీఎస్ …దేశీ పరీక్ష ఫెయిల్…డాక్టర్ల ప్రైవేట్ దందా

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతారు… కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ నే ఎండీ అంటారు. అలా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారు మన దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ డాక్టర్లుగా చలామణి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇటువంటి వారిని డాక్టర్లుగా నియమించుకుంటున్నాయి. నెలకు పాతిక వేలు జీతం ఇస్తే చాలని విదేశీ ఎంబీబీఎస్ అభ్యర్థులు భావిస్తుండటంతో, తక్కువ వేతనాలతోనే ఆసుపత్రులు…

Read More

శుభాంశు శుక్లా : అంతరిక్షంలో హెయిర్ కటింగ్

సహనం వందే, ఫ్లోరిడా:భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 60 శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మంగళవారం భూమిపైకి సురక్షితంగా చేరుకుంది. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన ఈ బృందం… 18 రోజుల్లో దాదాపు 1.22 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి, 288 భూ ప్రదక్షిణలు పూర్తి చేసింది. శుభాంశు ఒక్కరే ఇస్రో…

Read More

ఇండియా కూటమి బీసీ నినాదం – ముఖ్యమంత్రి రేవంత్ చొరవ

సహనం వందే, హైదరాబాద్:ఇండియా కూటమి పార్టీలలో బీసీ చర్చను లేవనెత్తేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. కూటమి పార్టీల ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదింప చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అయినందున… దాని అధినేత రాహుల్ గాంధీ అనుమతి తీసుకుని సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున…

Read More

ఆర్ఎంపీల గుప్పిట్లో ఆసుపత్రులు

సహనం వందే, హైదరాబాద్:ఆర్ఎంపీల పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చేస్తున్న దాడులు ప్రతి నిత్యం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులైన వైద్యులను పట్టుకోవడంలో మెడికల్ కౌన్సిల్ నిర్విరామంగా కృషి చేస్తోంది. ఆర్ఎంపీలను ఏరివేయడమే లక్ష్యంగా ఆ కౌన్సిల్ ఏర్పడిందా అన్న విధంగా దాడులు నిర్వహిస్తోంది. అర్హత లేకుండా వైద్యం చేయడాన్ని ఎవ్వరూ ఆమోదించరు. కానీ అదే ఆర్ఎంపీల నీడలో అనేక ఆసుపత్రులు నడుస్తున్నాయంటే అతిశయోక్తికాదు. ఇలా చేస్తున్నందువల్లే రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు రోగులతో రోగాలతో కళకళలాడుతున్నాయి. చిన్న…

Read More

ఆయిల్ ఫెడ్ లో సుధా’కత్తెర’రెడ్డి… బాల’కష్టాలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయంలో కీలక స్థాయిలో ఉన్న జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి అధికారాలకు కత్తెర వేశారు. కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ ఉండటంతో ఆయనను డమ్మీ చేయడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంతేకాదు ఆయన హోదాకు తగిన పోస్ట్ లేనటువంటి నర్మెట్ట ఫ్యాక్టరీకి బదిలీ చేయడం… దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆదేశాలను నిలిపివేయడం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పక్కన పెట్టినట్లు సమాచారం. దీనిపై సుధాకర్ రెడ్డి…

Read More

సిగిరెట్టు ఎంతో సమోసా అంతే – కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాలు

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సమోసా , జిలేబీ, పకోడా, వడపావ్, ఛాయ్ బిస్కెట్లు వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలపై సిగరెట్ల తరహా ఆరోగ్య హెచ్చరికలు ప్రదర్శించనుంది. ప్రజల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఈ వినూత్న ప్రచార…

Read More

నకిలీ ఎండీల బురిడీ-ఎంబీబీఎస్ కు సమానంగా విదేశీ ఎండీ కోర్స్

సహనం వందే, హైదరాబాద్: ______________________________________________________________________________________________________________________ రాష్ట్రంలో అనేకమంది నకిలీ ఎండీలు ఉన్నారు. అనేక దేశాల్లో ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ కోర్సు ఉంది. అంటే అక్కడ ఎండీ చేసినవాళ్లు ఇక్కడి ఎంబీబీఎస్ తో సమానం. ఆయా దేశాల్లో సదరు కోర్సు చేసిన పలువురు డాక్టర్లు రాష్ట్రంలో ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) లుగా చలామణి అవుతూ రోగులను బురిడీ కొట్టిస్తున్నారు. అంతేకాదు అలా చదివిన వారు తప్పుడు డిగ్రీతో దాదాపు 150 ఆసుపత్రులు నడిపిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి….

Read More

ఆయిల్‌ఫెడ్ ‘విజయ హైదరాబాద్’ బ్రాండ్ కు బీటలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణకు చెందిన ‘విజయ హైదరాబాద్’ బ్రాండ్‌ను కాపాడుకునే పేరుతో ఆయిల్‌ఫెడ్ ఓ ప్రైవేటు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ‘విజయ హైదరాబాద్’ నూనెలను విక్రయిస్తున్న టీఎస్‌-ఆయిల్‌ఫెడ్… కేవలం బ్రాండ్ పేరును, తమ గోదామును అత్యంత తక్కువ అద్దెకు ఇచ్చి చేతులు దులుపుకుందనే విమర్శలు వచ్చాయి. ప్రైవేటుకు అపరిమిత లబ్ధి…ఆయిల్‌ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ గా తిరుమలేశ్వర్ రెడ్డి ఈ కీలకమైన వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో విలువైన విజయ హైదరాబాద్…

Read More

రాముడిపై భక్తి… గోకర్ణ గుహలో రష్యన్‌ మహిళ జీవితం

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఉన్న రామతీర్థ కొండల గుహలో రష్యన్‌ మహిళ నీనా కుటినా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఎనిమిదేళ్లుగా రహస్యంగా జీవిస్తోంది. ఈ 40 ఏళ్ల మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు ప్రేమ, నాలుగేళ్ల కూతురు ఆమాతో కలిసి ఆధ్యాత్మిక జీవనం సాగించింది. ఆమె వీసా 2017లోనే ముగిసినప్పటికీ, భారతదేశంలోనే ఉంటూ గోకర్ణ అడవుల్లో దాక్కుంది. జులై 9న సాధారణ గస్తీలో ఉన్న గోకర్ణ పోలీసులు ఈ కుటుంబాన్ని గుర్తించి సురక్షితంగా…

Read More