ఆసుపత్రిపై బాంబులు: 400 మంది మృతి – ఆఫ్గాన్ గడ్డపై పాకిస్తాన్ మారణహోమం
సహనం వందే, కాబూల్: మానవత్వం మంటగలిసింది. ఆసుపత్రి ప్రాంగణం రక్తసిక్తమైంది. చికిత్స పొందుతున్న రోగులే లక్ష్యంగా బాంబుల వర్షం కురిసింది. పాకిస్థాన్ వైమానిక దాడులు ఆఫ్గాన్ గడ్డపై మారణహోమం సృష్టించాయి. అభం శుభం తెలియని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధోన్మాదం పరాకాష్ఠకు చేరిన వేళ కాబూల్ నగరం హాహాకారాలతో దద్దరిల్లింది. రాజకీయ చదరంగంలో సామాన్యులు బలైపోయారు. మృత్యువు విలయతాండవంకాబూల్ ఆసుపత్రిపై తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో మొత్తం 400 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది…