sahanamvande@gmail.com

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో… చిన్న తిమింగలం 200 కోట్లు మింగేస్తే..

సహనం వందే, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కలలను ఆశలతో నింపి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా చిత్రీకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, దానిని అవినీతి యంత్రంగా మార్చి ముంచింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో బంగారం, నగదు, విలాసవంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ,…

Read More

రెండు ఫ్లాట్లు… నిండా నోట్లు – కరోనా తీసుకొచ్చిన అదృష్టం

సహనం వందే, హైదరాబాద్: డాక్టర్ శ్రీహరిరావు (పేరు మార్చాం)… కరోనా కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో కీలక పోస్టులో పనిచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఆయన కంట్రోల్ ఉండేది. అప్పటి ప్రభుత్వం కూడా ఎనలేని ప్రాధాన్యం కల్పించింది. ఆయన స్థాయికి మించి బాధ్యతలు అప్పగించింది. వ్యాక్సిన్లు మొదలుకొని అన్నింటిపైనా అజమాయిషీ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కరోనా ఆయన పాలిట ధనలక్ష్మి అయ్యింది. ఆసుపత్రుల్లో శవాలు లేస్తుంటే… ఆ మాజీ వైద్యాధికారి ఇంట కరెన్సీ నోట్లు…

Read More

ఆయిల్ ఫెడ్ అధికారులపై వ్యవసాయ మంత్రి తుమ్మల ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై ఇటీవల వరుసగా ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ (sahanamvande.com & articletoday.in) డిజిటల్ పేపర్లలో వస్తున్న కథనాలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంగళవారం హైదరాబాదులోని ఆయిల్ ఫెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు. ఆయిల్ ఫెడ్ అక్రమాల్లో కొందరు అధికారుల తీరుపై మంత్రి మండిపడినట్లు సమాచారం. ఆ రెండు డిజిటల్ పేపర్లలో…

Read More

ఏలూరులో సాక్షి ఆఫీసుకు నిప్పు – రాష్ట్రవ్యాప్తంగా దాడులు

ఎడిటర్ ధనుంజయరెడ్డి, సైమాల ఖండన సహనం వందే, ఏలూరు:ఆంధ్రప్రదేశ్‌లో సాక్షికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఏలూరులో నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కొందరు దుండగులు సాక్షి ఆఫీసుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫాలు పూర్తిగా కాలిపోగా, పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ నేతలు కక్షపూరితంగా చేసిన పనే అని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనను సాక్షి…

Read More

రెడ్ల రగడ – మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై యాగీ

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం బహుజనులకు అవకాశం కల్పించడంపై రెడ్లు భగ్గుమంటున్నారు. తమకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం పట్ల ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు నానా యాగీ చేస్తున్నారు. బోధన్ లోనైతే సుదర్శన్ రెడ్డి అనుచరులు రాజీనామాలు కూడా చేస్తున్నారు. అలాగే బోధన్ బంద్ కు పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ కులగణన, సామాజిక న్యాయం…

Read More

కోట్లు కొల్లగొట్టారు – కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేసే కుట్ర

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్ ఫెడ్ పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు కీలక స్థాయి వ్యక్తులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని పామాయిల్ రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ను నాశనం చేస్తున్నారని అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేసింది. ఈ లేఖ ఆయిల్ ఫెడ్…

Read More

‘సాక్షి’లో కలకలం – కార్యాలయాల వద్ద ధర్నాలు

సహనం వందే, అమరావతి: సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఆ మీడియా సంస్థలో కలకలం చెలరేగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆ సంస్థలోని జర్నలిస్టులు భయపడుతున్నారు. గత నెల సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు టార్గెట్ చేశారు. విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఇలా ఒకటి తర్వాత ఇంకొకటి సాక్షిలో కీలక వ్యక్తులు టార్గెట్ అవడంపై జర్నలిస్టులు కలవరపడుతున్నారు. ఏమి రాస్తే…

Read More

స్కూల్ మోదీ… కాలేజీ చంద్రబాబు..ఉద్యోగం రాహుల్ గాంధీ

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్, తన రాజకీయ జీవితంలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలతో తనకున్న అనుబంధాన్ని ఆసక్తికరంగా వెల్లడించారు. ‘స్కూల్ మోదీ… కాలేజీ చంద్రబాబు దగ్గర చదివాను. ఇప్పుడు రాహుల్…

Read More

‘ఆయిల్ ఫెడ్’పై సురేందర్ కన్ను – మళ్లీ ఎండీగా ప్రయత్నాలు

సహనం వందే, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేందర్ ఆయిల్ ఫెడ్ లోకి మళ్లీ ఎంటర్ కావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ కార్పొరేషన్ కు ఆయన దాదాపు మూడేళ్లకు పైగా ఎండీగా పనిచేసి డిప్యూటీ సీఎం వద్దకు వెళ్లారు. అయితే ప్రస్తుత ఎండీ యాస్మిన్ బాషాకు అనేక ఇతర శాఖల బాధ్యతలు ఉండటంతో ఆమె ఆయిల్ ఫెడ్ పై అంతగా కేంద్రీకరించలేకపోతున్నారన్న చర్చ జరుగుతుంది….

Read More

అమెరికన్ జెండాల దహనం -లాస్ ఏంజిల్స్‌లో నిరసన జ్వాలలు

44 మంది అరెస్ట్… ఉద్రిక్తత సహనం వందే, లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్ నగరంలో ఇమ్మిగ్రేషన్ రైడ్స్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పరామౌంట్ ప్రాంతంలో హిస్పానిక్ జనాభా అధికంగా ఉండే చోట ప్రదర్శనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, కొందరు మెక్సికన్ జెండాలను ఊపగా, మరికొందరు అమెరికన్ జెండాను తగలబెట్టారు. ఫెడరల్ భవనం వెలుపల నినాదాలు మార్మోగాయి. అరెస్టులు… ఘర్షణలుశుక్రవారం లాస్ ఏంజిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్…

Read More