బరువు తగ్గడానికి మందులు బెస్ట్

సహనం వందే, న్యూయార్క్:బరువు తగ్గాలంటే శారీరక శ్రమ చేయాల్సిన అవసరం లేదని, దానికంటే మందులతో ఈజీగా తగ్గవచ్చని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణతో ఊబకాయానికి స్వస్తి పలకవచ్చని అంటున్నారు. యోగా, వ్యాయామం కంటే బరువు తగ్గించే మందులే ఎక్కువ ప్రభావం చూపిస్తాయని ఆయన విశ్లేషించారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమెరికాలో బిల్ గేట్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘సాంప్రదాయ…

Read More

సొమ్ము స్వాహా…!

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయల సొమ్ము స్వాహా అయ్యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోయాయి. స్టాక్ మార్కెట్ లు కుప్పకూలిపోయాయి. సామాన్యుడి పెట్టుబడులు… మొదలు కంపెనీల షేర్లు ఆవిరయ్యాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ సోమవారం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఫలితంగా భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ గ్యాస్ సిలిండర్ ధరలు హఠాత్తుగా పెరిగి… సాధారణ ప్రజల నడ్డి విరిచాయి. స్టాక్ మార్కెట్ పతనం అంటే…

Read More

సినీనటి దియామీర్జాపై యాక్షన్

సహనం వందే, హైదరాబాద్:కంచ గచ్చిబౌలి ప్రాంతంలో చెట్ల నరికివేతకు సంబంధించిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా తయారు చేసిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం… ఈ వివాదంలో సినీ నటి దియా మీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏఐతో రచ్చ రచ్చ…హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు…

Read More

నకిలీ కార్డియాలజిస్ట్‌ చికిత్సతో ఏడుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు సహనం వందే, భోపాల్:మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్‌గా పనిచేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నకిలీ డాక్టర్ చికిత్స చేసిన ఏడుగురు రోగులు మరణించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సోమవారం దమోహ్‌కు చేరుకుంది. బుధవారం వరకు అక్కడే ఉంటూ విచారణ జరుపనుంది. ఈ నకిలీ వైద్యుడు…

Read More

ట్రంప్ ‘హ్యాండ్స్ ఆఫ్’

సహనం వందే, న్యూయార్క్:అమెరికాలో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా వీధుల్లో అధ్యక్షుడు ట్రంప్, వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. “హ్యాండ్స్ ఆఫ్” ఉద్యమం ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా మారింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై టారీఫ్ లు విధించటంతో అంతర్జాతీయంగా ట్రంప్ పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా చైనా కూడా సుంకాల టారిఫ్ ను 34 శాతం పెంచడంతో, రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. మరోవైపు…

Read More

పేదల కడుపు నింపే సన్నబియ్యం

సహనం వందే, భద్రాచలం:రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లబ్దిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన…

Read More

అంతులేని అవినీతిలో ఐఏఎస్ లు

సహనం వందే, హైదరాబాద్:భారత పరిపాలనా వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) వ్యవస్థ దేశానికి నిజంగా న్యాయం చేయగలుగుతోందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పేపర్లో రాసిన వ్యాసం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. ‘ఐఏఎస్ వ్యవస్థ దేశానికి న్యాయం చేయలేదా?’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ వ్యాసంలో, సుబ్బారావు ఐఏఎస్…

Read More

తమిళంలో సంతకం ఎందుకు చేయరు?

సహనం వందే, చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తమిళ భాషపై ప్రేమ ఉన్నట్లయితే, తమిళనాడు నాయకులు తమ సంతకాలను తమిళ భాషలోనే చేయాలని పీఎం మోదీ సూచించారు. “తమిళనాడు నాయకుల నుంచి నాకు వచ్చే లేఖలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో ఎవరూ తమ సంతకాలను తమిళ భాషలో చేయడం లేదు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో భాషా వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో…

Read More

దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారు యాత్ర

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు కూతురు, కన్నడ నటి రన్యారావు బంగారు అక్రమ రవాణా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఈ కేసులో కీలక వివరాలను వెల్లడించారు. రన్యారావు 49.6 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించి, దానిని విక్రయించడంలో జ్యూయలర్ సహిల్ సకారియా జైన్ సహకరించినట్లు తేలింది. ఈ దొంగ బంగారం విలువ రూ. 40.14 కోట్లు. గత నెల మూడో తేదీన బెంగళూరు…

Read More

జగన్ టెన్షన్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తత రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం వరుస కేసులతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి వంటి కీలక నేతలు ఇప్పటికే జైలు పాలవగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై ఇప్పటికే నమోదైన క్విడ్ ప్రోకో వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను ఆధారంగా చేసుకుని ఆయన బెయిల్‌ను రద్దు…

Read More