నేను యోగిని… పొలిటిషియన్ కాదు

– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలనం సహనం వందే, లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణపై ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. “నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక యోగిని” అని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆయన భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, యోగి ఈ వ్యాఖ్యలు…

Read More

14 అంకెల సంఖ్యతో ఆరోగ్య ఖాతా

  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తో విప్లవాత్మక మార్పులు – కాగిత రహిత ఆరోగ్య సంరక్షణకు నాంది సహనం వందే, ఢిల్లీ: భారతదేశ ఆరోగ్య రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై రోగుల ఆరోగ్య రికార్డుల నిర్వహణ అత్యంత సులభతరం కానుంది. ఈ మేరకు 14 అంకెల ప్రత్యేక సంఖ్యతో కూడిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్ఏ)ను ప్రభుత్వం అందుబాటులోకి…

Read More

‘ఓవైసీకి తెలుగు రాదు… సీతక్కకు హిందీ రాదు’

   అసెంబ్లీ సాక్షిగా తెలుగుపై సాంస్కృతిక దాడి – హైదరాబాద్ హిందీ నగరంగా మారుతుంది – ఈ దుస్థితి తెలుగు అస్తిత్వానికి పెను ముప్పు! – సిటీలో తెలుగులో మాట్లాడేవారు 40 శాతమే – ఉత్తరాది వలసలు, వ్యాపారాలతో అధోగతి – పదో తరగతిలో హిందీ ఫెయిల్ అయ్యేవారు ఎక్కువే – విద్యార్థుల మెడకు త్రిభాషా సూత్రం అమలు – మ్యూజియం భాషగా తెలుగు మారకముందే మేల్కొనాలి – హిందీ దురాక్రమణను తిప్పి కొట్టాలని ‘సౌత్ సేన’…

Read More

సెంట్రల్ వర్సిటీ భూమి రణరంగం

   ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు – అది ప్రభుత్వ భూమి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం విద్యార్థుల ఆగ్రహానికి దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా, పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ భూమిని ఐటీ పార్కులు, ఇతర…

Read More

ఢిల్లీ బీసీ గర్జనకు రాహుల్ గాంధీ

   రేపు ఢిల్లీలో బీసీల మహాధర్నా – 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం – తెలంగాణ నుంచి చారిత్రక పోరాటం సహనం వందే, హైదరాబాద్: ఢిల్లీలో మంగళవారం నిర్వహించే బీసీల మహాగర్జనకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మహా ధర్నాకు రాహుల్ గాంధీ హాజరవడం దానికి రాజకీయ ప్రాముఖ్యత పెరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర…

Read More

మెదడుకు ‘పని-విశ్రాంతి’ తేడా తెలియదు

  అందువల్ల పనిని ప్రేమిస్తే వారానికి 70 గంటలైనా ఒత్తిడి ఉండదు! – ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు సమర్ధిస్తూ న్యూరాలజిస్ట్ సంచలన విశ్లేషణ! – సినీ నటుడు మాధవన్ తో పాడ్ కాస్ట్ లో డాక్టర్ సిద్ వారియర్ సహనం వందే, హైదరాబాద్: “మెదడుకు పని-విశ్రాంతి అనే భేదం తెలియదు. మీరు మీ పని పట్ల ఉత్సాహంగా, అభిరుచితో ఉంటే, అది ఒత్తిడిగా కాకుండా ఆనందంగా అనిపిస్తుంది,” అంటూ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ వారియర్ సంచలన వ్యాఖ్యలు…

Read More

డార్క్ వెబ్‌తో డ్రగ్స్ దందా

   తెలుగు రాష్ట్రాల్లో యువతను ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల మహమ్మారి – హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, ఖమ్మంలలో విక్రయాలు – క్రిప్టో కరెన్సీతో మాదకద్రవ్యాల లావాదేవీలు… డిజిటల్ పద్ధతిలో దందా – డ్రగ్స్ కేసుల్లో సినిమా తారలున్నట్లు నిర్ధారణ… అయినా శిక్ష పడలేదు – ప్రముఖులు తప్పించుకుంటే సామాన్యులు బలవుతున్నారన్న విమర్శలు సహనం వందే, హైదరాబాద్/విజయవాడ/విశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో డార్క్ వెబ్, బిట్‌కాయిన్‌లతో మాదకద్రవ్యాల వ్యాపారం యువతను కబళించే విషసర్పంలా విస్తరిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం…

Read More

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో మహిళల హవా

– టాపర్లుగా ఇద్దరు మహిళా అభ్యర్థులు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. మల్టీ జోన్-1, మల్టీ జోన్-2ల్లో టాపర్లుగా మహిళలే నిలవడం విశేషం. మల్టీజోన్-2లో 550 మార్కులతో ఒక మహిళా అభ్యర్థి టాపర్‌గా నిలవగా, మల్టీజోన్-1 లో 532.5 మార్కులతో మరొక మహిళా అభ్యర్థి అగ్రస్థానంలో నిలిచారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆదివారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్…

Read More

ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అత్యాధునిక ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత…

Read More

పేదరికం లేని రాష్ట్రమే నా లక్ష్యం

– ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రకటన సహనం వందే, విజయవాడ: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని ద్వారా అన్ని సేవలను ప్రజలకు అందించే…

Read More