sahanamvande@gmail.com

డబ్బు కోసం గడ్డి

సినీ తారలు, సెలబ్రిటీల పోకడ – బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో బాధ్యతారాహిత్యం – ఫలితంగా అనేకమంది యువత ఆత్మహత్య – గుట్కాలు, మద్యం బ్రాండ్లకు కూడా సినిమా తారల ప్రచారంపై విమర్శలు సహనం వందే, హైదరాబాద్ సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు.. వీళ్లంటే సామాన్యులకు ఎంతో అభిమానం. తెరపై కనిపించే హీరోలను ఆదర్శంగా తీసుకుని పాటించేవారు అనేకమంది ఉంటున్నారు. అయితే డబ్బుల కోసమో, మరే ఇతర కారణాల వల్లో సెలబ్రిటీలు చేసే తప్పుడు వాణిజ్య ప్రకటనలు ప్రజలను…

Read More

సన్‌రైజర్స్ విజయం

– రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సహనం వందే, హైదరాబాద్: ఐపీఎల్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 242/6 పరుగులకు…

Read More

డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం

 కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల నిజస్వరూపం బహిర్గతం – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపణ సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వారి అవకాశవాద రాజకీయాలను బట్టబయలు చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ లేదా కేబినెట్‌లో ఎటువంటి చర్చ జరగనప్పటికీ, ఈ పార్టీలు దక్షిణాదికి…

Read More

వడగళ్ల వర్షంతో 11 వేల ఎకరాల్లో పంట నష్టం

– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వెల్లడి సహనం వందే, హైదరాబాద్: రెండు రోజులుగా తెలంగాణలో వడగళ్ల వర్షం, ఈదురు గాలుల వల్ల తెలంగాణలో 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఏకకాలంలో రుణమాఫీ చేశాం… ఆర్థిక అస్తవ్యస్తత ఉన్నప్పటికీ, రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ….

Read More

భద్రాచలం శ్రీరామనవమికి సీఎంకు ఆహ్వానం

సహనం వందే, హైదరాబాద్: భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను ఆదివారం కలిసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్…

Read More

దక్షిణాదిపై ఢిల్లీ కుట్ర…

  డీలిమిటేషన్ పేరుతో పెను విధ్వంసం.. – చెన్నైలో కేటీఆర్ సంచలన ఆరోపణలు! సహనం వందే, హైదరాబాద్ చెన్నై వేదికగా జరిగిన డీలిమిటేషన్ సదస్సులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై ఢిల్లీ కుట్ర పన్నుతోందని, ఇది కేవలం పార్లమెంటు సీట్లకు మాత్రమే పరిమితం కాదని, ఆర్థిక విధ్వంసానికి కూడా దారితీస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం…

Read More

ప్రపంచ సుందరి సౌరభంతో మెరిసే భాగ్యనగరం

– తెలంగాణ సంస్కృతి సుగంధం! సహనం వందే, హైదరాబాద్ ముత్యాల సౌరభంతో కళకళలాడే హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ 2025 వేడుకలకు సర్వసన్నద్ధమైంది. మే 7 నుంచి ప్రపంచ నలుమూలల నుండి అందాల తారలు ఈ నగరానికి చేరుకోనున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ అందాల పర్వంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక వైభవం విశ్వవేదికపై వెలుగులీననున్నాయి. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యే ఈ వేడుకలు, కేవలం అందాన్ని, ప్రతిభను…

Read More

రైతులకు 24 గంటల్లోనే నగదు జమ: మంత్రి నాదెండ్ల మనోహర్

సహనం వందే, గుంటూరు ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రైతులు పండించిన ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి…

Read More

దక్షిణాది దెబ్బకు ఢిల్లీ పీఠాలు దద్దరిల్లాల్సిందే..

   33 శాతం సీట్ల కోసం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. – బీజేపీపై దక్షిణాది సీఎంల భీకర యుద్ధం… చెన్నై వేదికగా గళం – తదుపరి దక్షిణాది సీఎంల సమావేశం హైదరాబాదులో నిర్వహిస్తామని ప్రకటన సహనం వందే, హైదరాబాద్‌ లోక్‌సభ సీట్ల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఠాలను కదిలించేలా గర్జించారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ‘న్యాయమైన పునర్విభజన’ జాయింట్…

Read More

రాష్ట్రవ్యాప్తంగా ‘దావత్ ఏ ఇఫ్తార్’

ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం సహనం వందే, హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా ‘దావత్ ఏ ఇఫ్తార్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు నిధుల…

Read More