sahanamvande@gmail.com

టీసీఎస్‌ లో ఉద్యోగాల ఊచకోత – నైపుణ్యం లేదంటూ12 వేల మంది బలి

సహనం వందే, న్యూఢిల్లీ:టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) దేశ ఐటీ రంగంలో గొప్పలు చెప్పుకునే సంస్థ. కానీ ఇప్పుడు తన ఉద్యోగులను రోడ్డున పడేసే దుర్మార్గానికి ఒడిగట్టింది. 12,000 మంది ఉద్యోగులను అంటే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం మందిని ఏడాది కాలంలో తొలగించేందుకు ఈ కార్పొరేట్ కంపెనీ కత్తి సానబెట్టింది. క్లయింట్ డిమాండ్లు, ఆటోమేషన్, కొత్త టెక్నాలజీ అవసరాలను సాకుగా చూపుతూ మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగుల జీవితాలను చిదిమేస్తోంది. దశాబ్దాలుగా కంపెనీకి చెమటోడ్చి సేవలందించిన…

Read More

పంట పొలాల్లో రక్తపుటేరులు – అప్పులు.. నష్టాలతో రైతు ఆత్మహత్యలు

సహనం వందే, న్యూఢిల్లీ:2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏటా పది వేలకు పైగా రైతు జీవితాలు గాలిలో కలిసి పోవడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ విధానాల్లోని లోపాలు, అందని సాయం, పెరిగిన రుణ భారం రైతన్నలను ఈ దారుణమైన స్థితికి నెట్టాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ప్రభుత్వాల మొండి వైఖరిని…

Read More

అభిమానులతో ‘ఫుట్‌బాల్’ – ప్రపంచ కప్ ఒక్క టికెట్ రూ. 8.87 లక్షలు

సహనం వందే, అమెరికా:అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక 2026 ప్రపంచ కప్ మ్యాచ్‌ల టికెట్ల ధరల రహస్యం ఎట్టకేలకు బద్దలైంది. మొదట ధరలను గోప్యంగా ఉంచిన ఫిఫా… అతి తక్కువ ధరలు సుమారు రూ. 5,300 నుంచి మొదలవుతాయని మాత్రమే సెప్టెంబర్‌లో ప్రకటించింది. కానీ టికెట్ లాటరీలో గెలిచిన అభిమానులు ధరకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ధరలు సామాన్య అభిమానులకు ఆకాశాన్ని తాకే విధంగా ఉండటం…

Read More

అంబానీ క్లబ్‌లోకి ‘ఐఐటీ’యన్ ఎంట్రీ! – 31 ఏళ్లకే రూ. 21,190 కోట్ల సంపద

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు ఒక యువ భారతీయ పారిశ్రామికవేత్త. కేవలం 31 ఏళ్ల వయసుకే రూ. 21,190 కోట్ల నికర సంపదతో మెరిసి ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2025లో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు. ఆయనే అరవింద్ శ్రీనివాస్. ఏఐ రంగంలో తనదైన ముద్ర వేసిన ఈ చెన్నై యువకుడు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి…

Read More

రిజర్వేషన్ల ‘తప్పు’టడుగు – చిత్రవిచిత్రంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన తప్పులు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఓటరు లేని చోట పదవుల రిజర్వేషన్లు కల్పించడం వెనుక దాగి ఉన్న రాజకీయం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యంగా రూపొందిన రిజర్వేషన్లు అస్తవ్యస్తమైన డేటా ఆధారంగా కేటాయించడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియే అపహాస్యం అవుతోందని విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ తప్పిదాల కారణంగా పలు గ్రామాల్లో ఎన్నికలు జరగకముందే ఏకగ్రీవాలు ఖాయమవుతున్నాయి….

Read More

అప్పలనాయుడికి ‘చంద్ర’హారం – కలిశెట్టి సూపర్… చంద్రబాబు సర్టిఫికెట్

సహనం వందే, విజయనగరం:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. దత్తి గ్రామంలో బుధవారం పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎంపీ అప్పలనాయుడు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న విధానం ప్రశంసనీయమని కొనియాడారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను శక్తివంతంగా నిర్వహిస్తూ తెలుగుదేశంను ప్రాణంగా చూసుకుంటున్నారని సభా వేదికగా ప్రశంసించారు. ఈ కామెంట్లతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. సేవ…

Read More

జాతి విద్వేషం… గాంధీ విగ్రహం ధ్వంసం – లండన్‌లో భారతీయులపై హేట్ క్రైమ్‌లు…

సహనం వందే, లండన్:ఒకప్పుడు భారతదేశాన్ని రాచి రంపాన పెట్టి దోపిడీ చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు… ఇప్పుడు మళ్లీ తమ అహంకారాన్ని అప్పుడప్పుడు బయట పెడుతున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా వదలడం లేదు. ఆ దేశంలో ఉన్న కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహ ధ్వంసాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు…

Read More

దసరా హీట్… టూర్ ట్రీట్ – లాంగ్ వీకెండ్ కు టూరిస్టుల ప్లాన్

సహనం వందే, హైదరాబాద్:దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా పర్యాటక డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే లాంగ్ వీకెండ్ కోసం బుకింగ్‌లు గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 20 నుంచి 25 శాతం పెరిగాయి. హోటల్ రిజర్వేషన్లు సైతం 14 నుంచి 16 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పని ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం కోరుకోవడమే. కుటుంబాలు, యువత రెండు మూడు రోజుల వీకెండ్ గెటవేలకు…

Read More

గులాబీ ఐఫిల్… పింక్ చార్మినార్… క్యాన్సర్ పరార్

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ నగరం మంగళవారం అర్ధరాత్రి గులాబీమయం అయింది. ప్రముఖ భవనాలపై పింక్ రంగు మెరిసిపోయింది. అక్టోబర్ క్యాన్సర్ నివారణ నెల నేపథ్యంలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచంలో వైట్ హౌస్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఐఫిల్ టవర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలతో పాటు మన దేశంలో హైదరాబాదులో మాత్రమే పెయింట్ ది సిటీ పింక్ నిర్వహిస్తుండడం విశేషం. చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్‌ ఐమ్యాక్స్, దుర్గం…

Read More

బేడీలు వేసినా మారని మెడి’కేడీలు’ – ఎన్ఎంసీ అధికారులు ‘మహా’ ముదుర్లు

సహనం వందే, హైదరాబాద్:అదొక డబ్బా మెడికల్ కాలేజ్… నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందులో వసతులు లేవని లోకమంతా కోడై కూసింది. మూడేళ్ల క్రితం ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక బ్యాచ్ రద్దు కూడా చేశారు. అయినా దాని తీరు మారలేదు… జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అధికారుల అక్రమాలు ఆగలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా… నకిలీ రోగులు ఉన్నారని తేలినప్పటికీ ఆ కాలేజీకి ఎన్ఎంసీ తాజాగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లను…

Read More