sahanamvande@gmail.com

హైదరాబాద్‌లో ఇళ్ల క్రమబద్దీకరణ కుంభకోణం

   బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 58 పేరుతో వందల కోట్ల దోపిడీ – పేదల ఆశలను అమ్ముకున్న రెవెన్యూ అధికారులు, దళారులు – రెండేళ్లు కావస్తున్నా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్న మోసగాళ్లు – వేల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట దోపిడి… రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట జీవో నెంబర్ 58ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారు రెవెన్యూ అధికారులు,…

Read More

యువకుడిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్

   మేడ్చల్ లో రైలు కిందపడి ఆత్మహత్య – సినీ తారలపై దర్యాప్తు బిగుస్తున్న ఉచ్చు… – 19 కంపెనీలపై కేసులు… కోర్టులో సవాల్ సహనం వందే, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌ అనే పిశాచం యువత జీవితాలను బలితీసుకుంటోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ (24), రూ. 2 లక్షలు కోల్పోయి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో చివరి కాల్‌లో తన తీవ్ర ఒత్తిడిని బయటపెట్టి, రైలు ట్రాక్ వద్ద లొకేషన్ షేర్ చేశాడు. స్నేహితులు…

Read More

కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలో జర్నలిస్టులపై జరిగిన పోలీసు దాడికి నిరసనగా ఫొటో జర్నలిస్టులు పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. కెమెరాలను కింద పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఓ విద్యార్థి కిందపడిపోయిన సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయారు. ఇదంతా గమనించిన ఓ పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించాడు. వెంటనే…

Read More

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గు

   పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అధికం   – ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ సహనం వందే, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో లీటరు పెట్రోల్ ధర రూ. 109.60 కాగా, డీజిల్ ధర రూ. 97.47గా ఉంది. తమిళనాడులో పెట్రోల్ ధర రూ. 100.86, డీజిల్ ధర రూ. 92.39గా ఉంది. కర్ణాటకలో పెట్రోల్…

Read More

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, మతోన్మాద దాడులు పెరుగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున న్యాయవాది ఇజ్రాయిల్ హత్య, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం వంటి ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు కూడా పెరుగుతున్నాయని ఆయన…

Read More

ఎంపీల జీతాల దోపిడీ

పార్లమెంటు సభ్యులకు వేతనాలు పెంపు – 475 మంది ఎంపీలు కోటీశ్వరులు… – ఎంపీల సగటు ఆస్తి రూ. 20 కోట్లు… పెంపుపై మండిపడుతున్న జనం – హెటెరో అధినేత, ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ఆస్తి రూ. 5,300 కోట్లు – మరో పార్లమెంటు సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆస్తి రూ. 2,577 కోట్లు సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో చట్ట సభలకు ఎన్నిక అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అలా కోట్లకు…

Read More

మార్క్ ఫెడ్ లో ప్రజాధనం లూటీ

రెండేళ్లు జొన్నలు అమ్మని ఫలితంగా రూ. 130 కోట్లు నష్టం – రెండేళ్ల కాలంలో గోదాముల్లో పాడైపోయిన తెల్ల జొన్నలు… అధికారుల నిర్లక్ష్యమే – ఇప్పుడు టెండర్లు పిలవడంతో తక్కువకు కోట్ – కాంట్రాక్టర్ల సిండికేట్… కొందరు అధికారుల సపోర్ట్ సహనం వందే, హైదరాబాద్: రెండేళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి కొన్న తెల్ల జొన్నలు గోదాముల్లో పుచ్చిపోయేలా వదిలేసిన మార్క్‌ఫెడ్, ఇప్పుడు కాంట్రాక్టర్లకు తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023-24…

Read More

రైతులకు సాయం చేయండి

– ప్రభుత్వానికి జగన్ విజ్ఞప్తి సహనం వందే, అమరావతి: ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఆయన.. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షం, వడగళ్ల, గాలికి 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పార్ణపల్లె, ఏగువపల్లె, కోమటీనూతల, తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో 4000 ఎకరాల్లో వర్షానికి అరటి పంటలు దెబ్బతిన్నాయి…..

Read More

అవయవ మార్పిడిలో కొత్త శకం!

మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం అమలు – బ్రెయిన్ డెత్ నిర్ధారణకు మరికొందరు స్పెషలిస్టులు… – తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… అక్రమాలకు చెక్ సహనం వందే, హైదరాబాద్: 1994లో ఆమోదించిన మానవ అవయవాల మార్పిడి చట్టానికి 2011లో సవరణలు చేసి, దాన్ని మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం (తోట)గా రూపొందించారు. ఈ చట్టం అవయవాలతో పాటు కణజాలాల మార్పిడిని చట్టబద్ధం చేసింది. 2014లో కేంద్రం విడుదల చేసిన నిబంధనలతో దేశంలో 24 రాష్ట్రాలు…

Read More

దక్షిణాది పోరాటంలో ఆంధ్ర ఒంటరి!

డీలిమిటేషన్ ఉద్యమానికి దూరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు – రాజకీయ స్వార్థాలు ప్రజా ప్రయోజనాలను బలిపెడుతున్నాయా? – ఎన్డీఏ కూటమిలో ఉన్నందున చెన్నై సమావేశానికి వెళ్లని టీడీపీ, జనసేన – మరి వైసీపీ అధినేత జగన్ వెళ్లకపోవడంలో ఆంతర్యం ఏంటి? – రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీల నేతలు… విధానాలు సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తున్న ఈ కీలక సమయంలో, తమిళనాడు, కర్ణాటక, కేరళ,…

Read More