sahanamvande@gmail.com

క్లిని’కిల్’ ట్రయల్స్‌ – లాభాల వేట… రోగుల ప్రాణాలతో ఆట!

సహనం వందే, హైదరాబాద్:ఔషధ పరిశోధనల పేరుతో కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయా? క్లినికల్ ట్రయల్స్‌ లో రోగుల భద్రతకు కవచంగా నిలవాల్సిన నైతిక సమీక్ష మండలి (ఐఆర్‌బీ) తమ స్వతంత్రతను కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడా ఫార్మా కంపెనీల ఆర్థిక ప్రయోజనాల వలలో చిక్కుకున్న ఈ వ్యవస్థ రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఓజెంపిక్ వంటి ఔషధాల ట్రయల్స్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం… మన దేశంలో కూడా తీవ్ర…

Read More

బాడీ షేమింగ్… బహుజనుల ఫైటింగ్ – దున్నపోతు వ్యాఖ్య దుమారం…

సహనం వందే, హైదరాబాద్:బహుజనుల మధ్య సఖ్యత కొరవడింది. బీసీ, ఎస్సీల మధ్య ఉండాల్సిన ఐక్యత దెబ్బతింటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు బహుజన మంత్రుల మధ్య ఉన్న వర్గ వైరం చినికి చినికి గాలివానలా మారుతోంది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దున్నపోతు చుట్టూ దుమారం రేపాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి….

Read More

దళిత ‘సుప్రీం’పై దమనకాండ – ప్రధాన న్యాయమూర్తిపైనే కులోన్మాదం

సహనం వందే, న్యూఢిల్లీ:ఈ దేశంలో అత్యున్నత పదవుల్లోని బహుజన, దళిత వర్గాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. దేశ మాజీ రాష్ట్రపతి కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి… ఇద్దరూ దళితులే కావడంతో వారిపై అడుగడుగునా కులోన్మాదులు అనేక విధాలుగా మానసికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై న్యాయవాది రాకేష్ కిశోర్ బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. విచారణ సమయంలో సనాతన ధర్మాన్ని…

Read More

‘రియల్’ దూకుడు… దిమ్మతిరిగే ధరలు! – దేశంలో ఉరకలేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం

సహనం వందే, హైదరాబాద్:దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలు వేస్తుంది. సామాన్యుడి సొంతింటి కలపై ఈ ధరల మంట తీవ్ర ప్రభావం చూపుతోంది. 2025 మూడో త్రైమాసికంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ ఇంటి ధరలు ఏకంగా 24 శాతం పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదరపు అడుగు ధర రూ.7200 నుంచి రూ.8900కు చేరింది. గురుగ్రామ్, నోయిడా వంటి ఐటీ…

Read More

విడాకుల సంబరం… పాలతో స్నానం – కేక్ కట్ చేసిన యువకుడు

సహనం వందే, న్యూఢిల్లీ:విడాకులు అంటే విషాదం… విచారం అనే పాత భావనలు ఇప్పుడు కొత్త తరం యువత ఆలోచనల్లో చెరిగిపోతున్నాయి. వైవాహిక బంధం నుంచి విముక్తి పొందిన ఒక వ్యక్తి కేక్ కట్ చేసి పాల స్నానం చేసి పెళ్లికొడుకు వేషంలో తన ఒంటరి జీవితాన్ని పండుగలా జరుపుకోవడం మారుతున్న పోకడకు సజీవ సాక్ష్యం. ఈ విడాకుల సంబరం సోషల్ మీడియా లో వైరల్‌గా మారడం, భిన్నమైన అభిప్రాయాలకు తావివ్వడం గమనార్హం. స్వేచ్ఛ, వ్యక్తిగత ఆనందం అనే…

Read More

కరోనా విపత్తు… రెమెడెసివిర్ రాకెట్ – హరీష్ రావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శ

సహనం వందే, హైదరాబాద్:కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని కుదిపేసిన సమయంలో రెమెడెసివిర్ ఇంజెక్షన్ల చుట్టూ జరిగిన అవినీతి దారుణాలు ఇప్పటికీ ప్రజలను కలవరపరుస్తున్నాయి. అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖను శాసించిన మాజీ మంత్రి హరీష్ రావును పాలనలో ఈ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అతని నియంత్రణలో వైద్య వ్యవస్థ అవినీతి మయమైందని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా ఈ దారుణాలను ఎండగడుతూ హరీష్ రావును నిలదీస్తోంది. మందుల సరఫరా నుంచి వ్యాక్సిన్ల…

Read More

విదేశాల్లో విద్యార్థనాదాలు – ఆరేళ్లలో 842 మంది భారత విద్యార్థుల మృతి

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఉన్నత విద్య… మంచి ఉద్యోగం… మెరుగైన జీవితం అనే కలల రెక్కలు కట్టుకుని కడలి దాటిన భారతీయ యువ హృదయాలు అక్కడి ప్రమాదాల్లో ఆరిపోతున్నాయి. 2018 నుంచి 2024 వరకు ఈ ఆరేళ్లలో ఏకంగా 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం ఆశ… ఒక యువకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. కలల మాటున కన్నీళ్ల కథభారతీయ విద్యార్థులకు కలల గమ్యంగా…

Read More

దేశదేశాన ‘జెన్ జెడ్’ ప్రభంజనం – ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది

సహనం వందే, న్యూఢిల్లీ:మొరాకో… మడగాస్కర్… పెరూ… నేపాల్… ఈ పేర్లు ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశ దేశాలకు జెన్ జెడ్ ఉద్యమం ప్రభంజనంలా వ్యాపిస్తుంది. జెన్ జెడ్ తరం సామాజిక మాధ్యమాల నుంచి వీధుల్లోకి దిగి అధికార పీఠాలను కుదిపేస్తోంది. అవినీతి, అసమానతలు, అణచివేతలపై ఈ తరం గట్టిగా నినదిస్తుంది. మొరాకోలో జెడ్212 ఉద్యమం విద్య, వైద్య వ్యవస్థల్లోని దయనీయ దుస్థితిని బయటపెట్టింది. ఒకవైపు 2030 ప్రపంచ కప్ కోసం వేల…

Read More

బీసీ కోటా… కోర్టుల్లో రగడ – 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో సవాల్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ న్యాయపరమైన జోక్యం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్…

Read More

ఫ్యాషన్ ఉప్పు… థైరాయిడ్ ముప్పు – రాక్, పింక్ సాల్టుల్లో అయోడిన్ ఉండదు

సహనం వందే, న్యూఢిల్లీ:పప్పు… పచ్చళ్ల నుంచి నూడుల్స్… చాట్ వరకూ మన దైనందిన ఆహారంలో ఉప్పు దాగి ఉంటుంది. కానీ అధిక ఉప్పు వినియోగం మన గుండె, కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన పరిమాణం కంటే భారతీయులు ఏకంగా రెట్టింపు ఉప్పు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అలవాటును వెంటనే మార్చుకోవడం అత్యవసరం. ఉప్పు ఎక్కువైతే ప్రాణాలకు చేటు…డబ్ల్యూహెచ్ఓ ప్రకారం……

Read More