sahanamvande@gmail.com

కులోన్మాదం… ఐపీఎస్ ఆత్మ’బలి’దానం- డీజీపీ స్థాయి అధికారిపైనే దళిత వివక్ష

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో కులం అనే విషం ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి నిరూపించే దారుణ ఘటన ఇది. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య కేవలం ఒక వ్యక్తి విషాదాంతం కాదు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఒక దళిత అధికారి తన తోటి అధికారుల చేతిలో మానసిక హింసకు, జాతి వివక్షకు ఎలా బలైపోయాడో తెలిపే పచ్చి నిజం. చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణం చెందడం దేశంలోని…

Read More

ప్రైవేట్ క్యాబ్… మహిళల ట్రాప్ – యూపీఐ చెల్లింపులతో లీకవుతున్న నంబర్లు

సహనం వందే, న్యూఢిల్లీ:క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. ఓలా, ఉబర్, ఇన్‌డ్రైవ్, రాపిడో వంటి ప్రైవేటు రవాణా యాప్‌లు ఎంత గొప్ప భద్రతా హామీలు ఇచ్చినా… డ్రైవర్ల వేధింపులు ఆ హామీల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ముఖ్యంగా యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడం వల్ల మహిళల వ్యక్తిగత ఫోన్ నంబర్లు డ్రైవర్లకు లీక్ అవుతున్నాయి. దానిని అడ్డుపెట్టుకుని వారు వాట్సాప్ లేదా పేటీఎం వంటి వాటిలో అసభ్యకర సందేశాలు పంపడం… వేధించడం సమస్యగా…

Read More

దీపావళికి ’14 లక్షల కోట్ల’ మెరుపులు – ఊహించని స్థాయిలో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్:ఈ దీపావళి పండుగ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కావడం లేదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే ఉత్సవంగా మారింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనాల ప్రకారం… ఈ ఫెస్టివ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా జరిగే మొత్తం ఖర్చు రూ.12 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల మధ్య ఉండనుంది. జీఎస్‌టీ తగ్గింపులు, ఆదాయపు పన్ను ఉపశమనం, తక్కువ వడ్డీ రేట్లు, కోవిడ్ తర్వాత పెరిగిన కొనుగోలు డిమాండ్ వంటి అంశాలు భారీ బిజినెస్…

Read More

బహుజన హక్కుల బలిదానం – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చుక్కెదురు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించడం సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగించింది. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బహుజన సమాజానికి విద్య, ఉద్యోగం, రాజకీయం వంటి రంగాలలో సరైన అవకాశాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయన్న సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి బహుజనుల రాజ్యాంగ హక్కులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరిణామం దేశంలోని…

Read More

ఫిమేల్ ఫేవర్… పన్నెండు లీవ్స్ – స్త్రీలకు రుతు సెలవులు ప్రకటించిన కర్ణాటక

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సంవత్సరానికి పన్నెండు రుతు మాసపు సెలవుల నిర్ణయం చారిత్రక ఘట్టం. ఉద్యోగం చేస్తూ ఇల్లు, కుటుంబాన్ని సమన్వయం చేసే మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని గుర్తించి ప్రభుత్వం వారికి ఆరోగ్యపరంగా ఊరట నిచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం దొరికిందని ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు పని ఒత్తిడిని తగ్గించుకుని…

Read More

కమ్యూనిస్టు కోటకు డిజిటల్ కిరీటం – మరో చరిత్ర సృష్టించిన కేరళ రాష్ట్రం

సహనం వందే, కేరళ:అక్షరాస్యతలో ఇప్పటికే దేశానికి దిక్సూచిగా నిలిచిన కేరళ… ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యతలోనూ అదే మైలురాయిని అధిగమించింది. కేవలం 18 నెలల్లోనే ‘డిజి కేరళ’ కార్యక్రమం ద్వారా 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఓ మహా ఉద్యమంలా సాగిన ఈ ప్రయాణం… కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. స్వచ్ఛంద సైనికుల విజయగాథస్థానిక…

Read More

ప్రజా’రోగ్’ కార్యాలయం – ప్రజారోగ్య విభాగంలో అధికారి హరి లీలలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రజారోగ్య కార్యాలయం అవినీతికి, లైంగిక వేధింపులకు అడ్డాగా మారిందనేందుకు తాజా లీగల్ నోటీసు తిరుగులేని రుజువు. ఒక సీనియర్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అందులోనే పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఫిర్యాదు చేయడం వైద్య ఆరోగ్య శాఖలో సంచలనం అయింది. అంతేకాదు ఈ విషయంపై సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహ సహా ఉన్నతాధికారులకు లీగల్ నోటీసులు జారీ చేయడంతో యంత్రాంగం ఉలిక్కిపడింది. అవినీతి ఆరోపణలతో పాటు మహిళల వేధింపుల ఫిర్యాదులు నిత్యం…

Read More

మరణం ‘500 రెట్లు’ ఖాయం – దగ్గు మందుల్లో పరిమితికి మించి విషం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో తయారైన విషపూరితమైన దగ్గు మందు కారణంగా 17 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ ఘోరం జరిగి నెల రోజులు దాటినా ఇంకా మన డ్రగ్ కంట్రోలర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతులంతా ఐదేళ్ల లోపు వారే కావడం గుండెలవిసేలా చేస్తోంది ‘కోల్డ్రిఫ్’ అనే ఈ సిరప్‌లో డైథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనుమతించిన పరిమితికి ఏకంగా 500 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరీక్షల్లో తేలడం సంచలనం సృష్టిస్తుంది. ఈ…

Read More

బీజేపీ రాగం… టీడీపీ విలాపం – తెలంగాణ తెలుగుదేశం నేతల నిరాశ

సహనం వందే, అమరావతి/హైదరాబాద్:తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సుదీర్ఘ కాలం తర్వాత కదిలినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర టీడీపీ నేతలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని… ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని పార్టీ నేతలే వ్యాఖ్యానించడం టీడీపీకి దిశానిర్దేశం లేకపోవడాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ…

Read More

‘సుప్రీం’ నిప్పు… ‘సోషల్’ ముప్పు – సుప్రీం సీజే గవాయ్‌ పై సోషల్ వార్

సహనం వందే, న్యూఢిల్లీ:దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్ట్ కూడా మత ఘర్షణల మధ్య చిక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌ పై న్యాయవాది బూటు వేసిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఈ ఘటనకు పాల్పడిన న్యాయవాది ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. ఆ మేరకు ఆయన కొన్ని వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది….

Read More