sahanamvande@gmail.com

ప్రాణం తీసిన ప్రామిస్ – ఆశ పెట్టకండి… చావు చూడకండి

చలికాలపు ఒక రాత్రి… ఓ కోటీశ్వరుడు తన ఇంటి సమీపంలో తీవ్రమైన చలిలో ఉన్న ఒక నిరుపేద వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడి ఒంటి మీద కనీసం ఒక కోటు కూడా లేదు. అది చూసి ఆ కోటీశ్వరుడు ‘అయ్యో తాతయ్యా! ఈ చలిలో మీరు కోటు కూడా లేకుండా ఎలా ఉన్నారు?’ అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు ‘నాకు అలవాటైపోయింది బాబూ… కోటు లేకపోయినా ఈ చలిని తట్టుకునేలా మనసుని దృఢంగా చేసుకున్నాను’ అని…

Read More

అతిథి దేవో… భద్రత లేదో – ఇండోర్‌ లో విదేశీ మహిళా క్రికెటర్లకు వేధింపులు

సహనం వందే, ఇండోర్:క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడటానికి భారత్‌కు వచ్చిన విదేశీ మహిళా క్రీడాకారులకు భద్రత కరువైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ మహిళా ప్రపంచకప్ సందర్భంగా ఇండోర్‌ లో బస చేసిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లను ఓ మతిలేని వ్యక్తి వేధించడం దేశంలో మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హోటల్ నుంచి ఓ…

Read More

అవినీతి మంటల్లో బస్సు ప్రయాణం – నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి బస్సులు

సహనం వందే, హైదరాబాద్:కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు మంటల్లో 19 మంది మాడి మసైపోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సీటింగ్ బస్సుగా రిజిస్ట్రేషన్ పొందిన ఈ వాహనాన్ని స్లీపర్ బస్సుగా మార్చి రవాణా నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన వైనం బయటపడింది. 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించిన ఈ బస్సు 2023లో డయ్యూ డామన్‌లో ఎన్ఓసీతో మరో రిజిస్ట్రేషన్ పొంది నేషనల్ పర్మిట్ సాకుతో రోడ్లపై దూసుకెళ్లింది. ఒడిశాలోని రాయగడలో ఆల్టరేషన్…

Read More

ట్రంప్ బ్రాండ్… ‘రియల్’ ట్రెండ్ – భారత మార్కెట్లో ట్రంప్ ఎస్టేట్ మోజు

సహనం వందే, న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్‌తో కూడిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు భారత్ అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా మారింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ (గూర్గావ్)లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు లగ్జరీ ప్రాజెక్టులతో పాటు… ఇప్పుడు హైదరాబాద్‌లోని కోకపేట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రకటన రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 63 అంతస్తులతో సుమారు రూ. 3,500 కోట్ల పెట్టుబడితో ఈ టవర్లు నిర్మాణం కానున్నాయని డెవలపర్లు చెబుతున్నారు. ఈ భారీ…

Read More

మార్క్సిజం… మస్కిజం – మార్క్స్, మస్క్ ల లక్ష్యం సంపద పంపిణీయే

సహనం వందే, హైదరాబాద్:కారల్ మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిజం సిద్ధాంతం, ఎలాన్ మస్క్ ఊహించిన రోబో యుగం— ఈ రెండు దృక్పథాలూ ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టి సంపద సమృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాయి. మార్క్స్ అందించిన ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు పని, ఎవరి అవసరానికి తగ్గట్టు సంపద పూర్తిస్థాయిలో అనుభవించడం అనే సూత్రం… మస్క్ ప్రతిపాదించిన యూనివర్సల్ హై ఇన్‌కం ఆలోచనతో ఆశ్చర్యకరంగా పోలి ఉంది. రెండు ఆలోచనల అంతిమ లక్ష్యం ఒకటే. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక…

Read More

స్మార్ట్ సర్జరీ.‌‌.. ‘బ్రెస్ట్’ రికవరీ- రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స

సహనం వందే, హైదరాబాద్:రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానాలను ఎంఎన్ జే క్యాన్సర్‌ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. రొమ్ము క్యాన్సర్‌కు పెరుగుతున్న ముప్పు, చికిత్సలో నూతన విధానాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పాత్రపై ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజీ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌ మాటూరితో ‘సహనం వందే’ ప్రత్యేక ఇంటర్వ్యూ… సహనం వందే: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? దీని పెరుగుదల ఆందోళన కలిగిస్తోందా? డాక్టర్ రమేష్: భారతీయ మహిళలకు…

Read More

గోల్కొండ వజ్రం… ఫ్రాన్స్ రక్తసిక్తం – రత్నం వెనుక శాపం…‌ రక్తపాతం… విప్లవం

సహనం వందే, పారిస్:ప్రపంచ ప్రసిద్ధి చెందిన రీజెంట్ వజ్రం చుట్టూ అల్లుకున్న రహస్యాలు… దాని భారతీయ మూలాల శాపం తాజాగా జరిగిన లూవ్ర్ మ్యూజియం దొంగతనంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కోట్ల విలువైన ఇతర ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు… గోల్కొండ గనుల నుంచి వచ్చిన ఈ రీజెంట్ రాణి వజ్రాన్ని మాత్రం తాకకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చరిత్రలోని ఈ అపురూప వజ్రం కేవలం రత్నం కాదు… రక్తపాతంతో మొదలైన ఒక శాపగ్రస్త కథకు…

Read More

పాలకుల ఆటలో ‘కోటా’కు బీటలు – రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీల మెగా ధర్నా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగారి పోతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం కోటా బిల్లు కోర్టుల కారణంగా ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ అన్యాయానికి నిరసనగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం (24న) ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌లు, ర్యాలీలు పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభ్యర్థనలను అణచివేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మహాధర్నా బీసీల…

Read More

అనారోగ్య దళితుడిపై అగ్రకుల దమనకాండ – ఆలయం పరిసరాల్లో మూత్రం పోశాడని ఫైర్

సహనం వందే, లక్నో:లక్నో సమీపంలోని కాకోరి పట్టణంలో జరిగిన దారుణ ఘటన దేశంలో కుల వివక్ష ఎంత వికృతంగా ఉందో మరోసారి బట్టబయలు చేసింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల దళిత వృద్ధుడు రంపాల్ రావత్..‌. దీపావళి రోజున శీత్ల మాతా ఆలయం సమీపంలో అనుకోకుండా మూత్ర విసర్జన చేస్తే… ఒక స్థానికుడు అతనిపై దాడి చేసి అవమానించడం మానవత్వానికే సిగ్గుచేటు. మందిరానికి కనీసం 40 మీటర్ల దూరంలో జరిగిన ఈ చిన్నపాటి అనుకోని ఘటనను…

Read More

బ్రిటీషర్ల కంటే ఇస్లామీస్ డేంజర్ – యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, లక్నో:ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోరఖ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆయన రాజకీయ ఇస్లాంను బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదంతో పోల్చడమే కాకుండా… సనాతన ధర్మాన్ని బలహీనపరిచేందుకు దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందనే ఆరోపణలు చేశారు. గోరఖ్‌పూర్ వేదికగా యోగి సంధించిన ఈ విమర్శనాస్త్రాలు దేశ ప్రజల దృష్టిని మతపరమైన విభజనల వైపు మళ్లిస్తున్నాయనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది. బ్రిటిష్,…

Read More