మెడికోలపై ‘ప్రైవేట్’ల ఆగడాలు

సహనం వందే, హైదరాబాద్: వైద్య విద్యార్థులపై ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆగడాలకు అంతే లేదు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూల్ చేయడం… విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలను కాజేయడం… ఇదేంటని ప్రశ్నిస్తే ‘మీ జీవితం మా చేతుల్లో ఉందం’టూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మెడికోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని వైద్య విద్యార్థులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్న వైనం, వారిని వేధిస్తున్న తీరుపై తెలంగాణ అడ్మిషన్, ఫీజు…

Read More

అందం వెనుక విషాదం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల వయసులో రొమ్ము కణితి శస్త్రచికిత్సను చేయించుకుని, రొమ్ము క్యాన్సర్ అవగాహనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఈ యువతి ప్రస్థానం హృదయాన్ని పిండేస్తుంది. ఆమె విజయం కేవలం అందానికే కాదు. ఆమె సంకల్పానికి, సమాజం పట్ల బాధ్యతకు నిదర్శనం. 16 ఏళ్లలోనే జీవిత పాఠం…2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని…

Read More

బహుజనం నెత్తిన అగ్రవర్ణ పెత్తనం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో అగ్రవర్ణాలే ఆదిపత్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ మళ్లీ పదవులు కావాలని హై కమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు. అగ్రవర్ణ పెత్తనాన్ని మరింత విస్తరించేందుకు కుట్రలు పనుతున్నారు. 85% బహుజన జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల పెత్తనంపై విమర్శలు వస్తున్నాయి. కుల గణన, సామాజిక న్యాయంపై కాంగ్రెస్ చెప్తున్నవన్నీ కబుర్లే అని బహుజన వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉండగా… అందులో ఐదుగురు…

Read More

నీళ్లు లేని ఫైరింజన్లు

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జర్ హౌస్‌లో 18న ఘోర అగ్నిప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటన తెలంగాణ రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ, పోలీసు, వైద్య విభాగాల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబీకులను కోల్పోయామని ఆవేదనతో మీడియా ముందుకు వచ్చారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సన్నద్ధత లేమి ఈ విషాదానికి ప్రధాన…

Read More

మిక్సోపథీ ప్రజారోగ్యానికి పెను ప్రమాదం

సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మిక్సోపథీ విధానం ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) విమర్శించింది. వైద్య విద్యను శాస్త్రీయత నుండి వేరుచేసే ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జూడా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూడా అధ్యక్షుడు డాక్టర్ ఐజాక్ న్యూటన్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, ఆధునిక వైద్యం శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా ఏర్పడిన ఘనమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు….

Read More

కమల్ హాసన్ మాటల తూటాలు

సహనం వందే, చెన్నై: చెన్నైలో ఇటీవల జరిగిన థగ్ లైఫ్ అనే కార్యక్రమం ఒక భారీ వివాదానికి కేంద్రమైంది. ఈ వేడుకలో పాల్గొన్న కమల్ హాసన్, కన్నడ భాష కూడా తమిళం నుంచే ఉద్భవించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమైంది. తమిళులు, కన్నడిగుల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండవన్న విషయం తెలిసిందే. జల వివాదాలు, సరిహద్దు తగాదాలు వంటి అంశాలు ఎప్పుడూ రగులుకుంటూనే ఉంటాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా…

Read More

ఆర్థికమా? అధికారమా?

సహనం వందే, హైదరాబాద్: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టు పితామహుడు కారల్ మార్క్స్ చెప్పింది అక్షరాలా నిజం. డబ్బు, పదవి… ఈ రెండూ కవల పిల్లలు. ఈ రెండింటి కోసం రక్త సంబంధాలన్నింటినీ ధ్వంసం చేసుకోవటానికి కూడా వెనుకాడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ తోనూ తెగతెంపులు చేసుకోవడానికి ఆ రెండే కారణం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి… ఇవన్నీ కూడా పదవి, డబ్బు ముందు దిగదుడుపే. ఆంధ్రప్రదేశ్ లో…

Read More

‘పోష్ కాదు స్లేవ్స్’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వివాదాస్పద, అమానవీయ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అగ్ని రాజేశాయి. గురుకులాల్లో చదివే దళిత విద్యార్థులను పాష్ సొసైటీ నుంచి రాలేదని చులకనగా కించపరిచి, వారితో టాయిలెట్లు, గదులు శుభ్రం చేయించడాన్ని సమర్థించిన ఆమె, చివరకు పిల్లల తల్లిదండ్రులను షోకాజ్ నోటీసులతో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించడమే కాక, ఐఏఎస్ అధికారిగా ఆమె స్థాయికే మచ్చ…

Read More

థగ్ లైఫ్ ఒక మహత్తర చిత్రం:

ప్రేక్షకులే మా బలం… కమల్ హాసన్! సహనం వందే, విశాఖపట్నం: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో థగ్ లైఫ్ ఒకటి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది….

Read More

వ్యవసాయశాఖలో ‘మావోయిస్టు’ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్: వ్యవసాయ దాని అనుబంధ శాఖలకు చెందిన అనేక కార్పొరేషన్లలో ఒక కార్పొరేషన్ చైర్మన్ వ్యవహారం విమర్శలకు తావిస్తుంది. తనకు మావోయిస్టు బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని గొప్పగా చెప్పుకుంటూ… ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రతిపక్ష కేడర్, మీడియా, ప్రైవేట్ వ్యాపారులను ఆయన బహిరంగంగా బెదిరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘నేను గతంలో నక్సలైట్లలో పనిచేశా… నాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి… నన్ను విమర్శిస్తే నా బ్యాక్‌గ్రౌండ్‌తో బయటకొస్తా… నాతో పెట్టుకుంటే ఖతమే’ అంటూ ఆయన చేస్తున్న…

Read More